దేశం విడిచి వెళ్లొద్దంటూ పౌరులు,ప్రవాసులకు కువైట్ హెచ్చరిక..!
- December 01, 2021
కువైట్ సిటీ: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ నేపథ్యంలో దేశ పౌరులు, వలసదారులకు కువైట్ తాజాగా కీలక సూచన చేసింది. ప్రస్తుత పరిస్థితిలో దేశం నుంచి బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది.కొత్త వేరియంట్ శరవేగంగా ప్రబలుతున్నందున ఈ సమయంలో విదేశాలకు వెళ్లడం మంచిది కాదని అంతర్గత, ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.కొన్ని రోజుల తర్వాత ఒమైక్రాన్(B.1.1.529)పై ఓ అవగాహన ఏర్పడే అవకాశం ఉందని, అప్పటి వరకు కువైట్ విడిచి బయటకు వెళ్లొద్దని సూచించారు.అలాగే నవంబర్ 27న మంత్రివర్గం తీసుకువచ్చిన ప్రత్యేక కరోనా నిబంధనలను పౌరులు, నివాసుతులు పాటించాలని కోరారు.తప్పని పరిస్థితిలో మాత్రమే ప్రత్యేక అనుమతులు తీసుకుని వెళ్లొచ్చని తెలిపారు.ఇక ఇప్పటికే ఒమైక్రాన్ కట్టడికి కువైట్ చర్యలు చేపట్టింది.దీనిలో భాగంగా తొమ్మిది ఆఫ్రికన్ దేశాలకు కువైత్ విమాన సర్వీసులు నిలిపివేసింది.ఈ మేరకు కువైటీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటన చేసింది.విదేశాల్లో చిక్కుకున్న వారు అవసరమైన సాయం పొందడానికి ఆయా దేశాల్లోని కువైట్ ఎంబసీలతో కమ్యూనికేట్ కావాలని మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ సూచించింది.
తాజా వార్తలు
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్
- జర్మనీలో ఫిజియోథెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులకు ఉద్యోగావకాశాలు
- ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..







