దేశం విడిచి వెళ్లొద్దంటూ పౌరులు,ప్రవాసులకు కువైట్ హెచ్చరిక..!

- December 01, 2021 , by Maagulf
దేశం విడిచి వెళ్లొద్దంటూ పౌరులు,ప్రవాసులకు కువైట్ హెచ్చరిక..!

కువైట్ సిటీ: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ నేపథ్యంలో దేశ పౌరులు, వలసదారులకు కువైట్ తాజాగా కీలక సూచన చేసింది. ప్రస్తుత పరిస్థితిలో దేశం నుంచి బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది.కొత్త వేరియంట్‌ శరవేగంగా ప్రబలుతున్నందున ఈ సమయంలో విదేశాలకు వెళ్లడం మంచిది కాదని అంతర్గత, ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.కొన్ని రోజుల తర్వాత ఒమైక్రాన్(B.1.1.529)పై ఓ అవగాహన ఏర్పడే అవకాశం ఉందని, అప్పటి వరకు కువైట్ విడిచి బయటకు వెళ్లొద్దని సూచించారు.అలాగే నవంబర్ 27న మంత్రివర్గం  తీసుకువచ్చిన ప్రత్యేక కరోనా నిబంధనలను పౌరులు, నివాసుతులు పాటించాలని కోరారు.తప్పని పరిస్థితిలో మాత్రమే ప్రత్యేక అనుమతులు తీసుకుని వెళ్లొచ్చని తెలిపారు.ఇక ఇప్పటికే ఒమైక్రాన్ కట్టడికి  కువైట్ చర్యలు చేపట్టింది.దీనిలో భాగంగా తొమ్మిది ఆఫ్రికన్ దేశాలకు కువైత్ విమాన సర్వీసులు నిలిపివేసింది.ఈ మేరకు కువైటీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటన చేసింది.విదేశాల్లో చిక్కుకున్న వారు అవసరమైన సాయం పొందడానికి ఆయా దేశాల్లోని కువైట్ ఎంబసీలతో కమ్యూనికేట్ కావాలని మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ సూచించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com