దేశం విడిచి వెళ్లొద్దంటూ పౌరులు,ప్రవాసులకు కువైట్ హెచ్చరిక..!
- December 01, 2021
కువైట్ సిటీ: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్ నేపథ్యంలో దేశ పౌరులు, వలసదారులకు కువైట్ తాజాగా కీలక సూచన చేసింది. ప్రస్తుత పరిస్థితిలో దేశం నుంచి బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది.కొత్త వేరియంట్ శరవేగంగా ప్రబలుతున్నందున ఈ సమయంలో విదేశాలకు వెళ్లడం మంచిది కాదని అంతర్గత, ఆరోగ్యశాఖ అధికారులు పేర్కొన్నారు.కొన్ని రోజుల తర్వాత ఒమైక్రాన్(B.1.1.529)పై ఓ అవగాహన ఏర్పడే అవకాశం ఉందని, అప్పటి వరకు కువైట్ విడిచి బయటకు వెళ్లొద్దని సూచించారు.అలాగే నవంబర్ 27న మంత్రివర్గం తీసుకువచ్చిన ప్రత్యేక కరోనా నిబంధనలను పౌరులు, నివాసుతులు పాటించాలని కోరారు.తప్పని పరిస్థితిలో మాత్రమే ప్రత్యేక అనుమతులు తీసుకుని వెళ్లొచ్చని తెలిపారు.ఇక ఇప్పటికే ఒమైక్రాన్ కట్టడికి కువైట్ చర్యలు చేపట్టింది.దీనిలో భాగంగా తొమ్మిది ఆఫ్రికన్ దేశాలకు కువైత్ విమాన సర్వీసులు నిలిపివేసింది.ఈ మేరకు కువైటీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రకటన చేసింది.విదేశాల్లో చిక్కుకున్న వారు అవసరమైన సాయం పొందడానికి ఆయా దేశాల్లోని కువైట్ ఎంబసీలతో కమ్యూనికేట్ కావాలని మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ సూచించింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







