యూఏఈలో కొత్త రైల్వే ప్రాజెక్ట్ లు.. లక్షల మంది ప్యాసింజర్స్ కి బెనిఫిట్
- December 06, 2021
యూఏఈ: కొత్త రైల్వే ప్రాజెక్ట్ ను ప్రారంభించినట్లు యూఏఈ ప్రకటించింది. డిసెంబర్ 2న గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకున్న తర్వాత ‘యూఏఈ న్యూ 50’లో భాగంగా ప్రకటించిన మొదటి ప్రాజెక్ట్ ఇది. యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, దుబాయ్ రూలర్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఈ మేరకు ట్వీట్ చేశారు. “ఈ ప్రాజెక్ట్ మా జాతీయ ప్రాధాన్యత ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి మరింత ముందుకు తీసుకుపోతుంది. యూఏఈని ఒక ఆర్థిక గమ్యస్థానంగా స్థాపించడంలో ఉపయోగపడుతుంది. యూఏఈ న్యూ 50 ని ప్రారంభించడం సంతోషంగా ఉంది.' అని షేక్ మహమ్మద్ ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్ట్ యూనియన్ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. యూఏఈ రైల్వే ప్రోగ్రామ్ ద్వారా సంవత్సరానికి 36.5 మిలియన్ల మంది ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చనుంది. ఈ రైల్వే ప్రాజెక్ట్ యూఏఈలోని ముఖ్యమైన 11 నగరాలు, ఇతర ప్రాంతాలను కలుపుతూ నిర్మించనున్నారు. 50 బిలియన్ దిర్హామ్ల పెట్టుబడితో ప్రారంభించబడిన ఇది 200 బిలియన్ దిర్హామ్లకు పైగా రాబడిని ఇస్తుందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







