భారత్లో కరోనా కేసుల వివరాలు
- December 10, 2021
న్యూ ఢిల్లీ: భారత్లో రోజువారి కరోనా కేసుల సంఖ్యలో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. ఓ రోజు పెరుగుతూ మరో రోజు తగ్గుతూ ఉన్నాయి. నిన్నటితో పోలిస్తే నేడు కేసుల సంఖ్య తగ్గింది పెరిగింది. గడిచిన 24 గంటల్లో 12,93,412 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. 8,503 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు శుక్రవారం ఉదయం విడుదల చేసిన బులిటెన్లో కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,46,74,744కి చేరింది. నిన్న ఒక్క రోజే 624 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,74,735 కి చేరింది.
నిన్న7,678 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు వైరస్ను జయించిన వారి సంఖ్య 3,41,05,066కి చేరింది. ప్రస్తుతం దేశంలో 94,943 యాక్టివ్ కేసులు ఉన్నాయి. జాతీయ రికవరీ రేటు 98.36 శాతానికి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సినేషన్ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. నిన్న 74.5 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ను వేశారు. ఇప్పటి వరకు 131.18 కోట్లకు పైగా డోసుల వ్యాక్సిన్ను పంపిణీ చేశారు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









