మహజూజ్ వీక్లీ డ్రా లో జాక్పాట్ కొట్టిన భారతీయుడు
- December 10, 2021దుబాయ్: దుబాయ్లో నిర్వహించిన మహజూజ్ వీక్లీ డ్రాలో ఓ భారతీయుడు జాక్పాట్ కొట్టాడు.ఈ లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన అక్షయ్ ఎరియకడన్ అరవిందన్(22) అనే భారత యువకుడు ఏకంగా ఒక కేజీ బంగారం గెలుచుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన అక్షయ్ ఉపాధి కోసం రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లారు. అక్కడ ఒక గ్యాస్ ఏజెన్సీలో డ్రైవర్గా పని చేస్తున్నారు. అలా వచ్చిన సంపాదనతో స్వదేశంలో తనకు ఉన్న అప్పులు, కుటుంబ అవసరాలను తీరుస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో స్నేహితుల సూచన మేరకు ఇటీవల మహజూజ్ 54వ వీక్లీ డ్రాలో టికెట్ కొనుగోలు చేశారు. తాజాగా దుబాయ్లో మహజూజ్ లక్కీ డ్రా నిర్వహించారు. ఇందులో అక్షయ్ విజేతగా నిలిచారు. దీంతో మొదటి బహుమతిగా ఒక కిలో బంగారం గెలుచుకున్నారు.
ఇక ఇంత భారీ ప్రైజ్ గెలిచినందుకు అక్షయ్ ఆనందానికి అవధుల్లేవు.గత ఏడాది తన తండ్రి క్యాన్సర్తో చనిపోయారని, సరిగ్గా తన తండ్రి సంవత్సరికం రోజున మహజూజ్ డ్రా నిర్వహించడం, అందులో తాను కిలో బంగారం గెలుచుకోవడం నిజంగా నమ్మలేకపోతున్నానని అక్షయ్ చెప్పారు. ఇది తన తండ్రి తనకు దీవించి ఇచ్చిన బహుమతిగా ఆయన పేర్కొన్నారు. తన ఫ్యామిలీ అప్పులన్నీ తీర్చేయడమే తన కలగా చెప్పిన ఆయన.. ఈ భారీ ప్రైజ్తో అది సాకారం అవుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో కొంత మొత్తాన్ని వెచ్చించి ఓ ఇల్లు నిర్మించడంతో పాటు తన తల్లికి బంగారు చైన్ కూడా కొనుగోలు చేస్తానని అక్షయ్ తెలిపారు.
తాజా వార్తలు
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..