మహజూజ్ వీక్లీ డ్రా లో జాక్పాట్ కొట్టిన భారతీయుడు
- December 10, 2021దుబాయ్: దుబాయ్లో నిర్వహించిన మహజూజ్ వీక్లీ డ్రాలో ఓ భారతీయుడు జాక్పాట్ కొట్టాడు.ఈ లక్కీ డ్రాలో విజేతగా నిలిచిన అక్షయ్ ఎరియకడన్ అరవిందన్(22) అనే భారత యువకుడు ఏకంగా ఒక కేజీ బంగారం గెలుచుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన అక్షయ్ ఉపాధి కోసం రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లారు. అక్కడ ఒక గ్యాస్ ఏజెన్సీలో డ్రైవర్గా పని చేస్తున్నారు. అలా వచ్చిన సంపాదనతో స్వదేశంలో తనకు ఉన్న అప్పులు, కుటుంబ అవసరాలను తీరుస్తూ అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో స్నేహితుల సూచన మేరకు ఇటీవల మహజూజ్ 54వ వీక్లీ డ్రాలో టికెట్ కొనుగోలు చేశారు. తాజాగా దుబాయ్లో మహజూజ్ లక్కీ డ్రా నిర్వహించారు. ఇందులో అక్షయ్ విజేతగా నిలిచారు. దీంతో మొదటి బహుమతిగా ఒక కిలో బంగారం గెలుచుకున్నారు.
ఇక ఇంత భారీ ప్రైజ్ గెలిచినందుకు అక్షయ్ ఆనందానికి అవధుల్లేవు.గత ఏడాది తన తండ్రి క్యాన్సర్తో చనిపోయారని, సరిగ్గా తన తండ్రి సంవత్సరికం రోజున మహజూజ్ డ్రా నిర్వహించడం, అందులో తాను కిలో బంగారం గెలుచుకోవడం నిజంగా నమ్మలేకపోతున్నానని అక్షయ్ చెప్పారు. ఇది తన తండ్రి తనకు దీవించి ఇచ్చిన బహుమతిగా ఆయన పేర్కొన్నారు. తన ఫ్యామిలీ అప్పులన్నీ తీర్చేయడమే తన కలగా చెప్పిన ఆయన.. ఈ భారీ ప్రైజ్తో అది సాకారం అవుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఇందులో కొంత మొత్తాన్ని వెచ్చించి ఓ ఇల్లు నిర్మించడంతో పాటు తన తల్లికి బంగారు చైన్ కూడా కొనుగోలు చేస్తానని అక్షయ్ తెలిపారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు