24 నుంచి 26 వరకు అమరావతి నాటకోత్సవాలు
- March 23, 2016
గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో ఆరాధన ఆర్ట్స్ అకాడమి, యువ కళావాహిని సంయుక్త ఆధ్వర్యంలో 24 నుంచి 26 వరకు అమరావతి నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అకాడమి అధ్యక్షుడు డి.తిరుమల్లేశ్వరరావు తెలిపారు. బుధవారం బ్రాడీపేటలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గురువారం ప్రముఖ రంగస్థల నటుడు కావూరి సత్యనారాయణ, సిరిగిరి సాంబశివరావులకు ఆరాధన అర్ట్స్ అకాడమి ఆత్మీయ పురస్కారం అందజేయనున్నట్లు తెలిపారు. అనంతరం యువ కళావాహిని వారి బాపు చెప్పిన మాట, ఆరాధన ఆర్ట్స్ అకాడమీ అశ్వద్ధామ నాటక ప్రదర్శనలు ఉంటాయన్నారు. 25న మన్నె శ్రీనివాసరావుకు గురజాడ గోపరాజు రమణకు బళ్లారి రాఘవ, నుసుమ కోటి శివకు సిఎస్ఆర్, నాయుడు గోపికి గరికపాటి రాజారావు, టి.బాలరాజుకు రఘురామయ్య, కె.రామకృష్ణ ప్రసాద్కు గోవిందరావు పురస్కారాలతో సత్కరించనున్నట్లు తెలిపారు. అనంతరం స్వామి వివేకానంద నాటకం, పద్మశ్రీచే అన్నమయ్య సంకీర్తన గానం, క్రాంతిచే అమరావతి నృత్య రూపకం ఉంటాయన్నారు. 26న నాటకోత్సవాలు, అమరావతిలో శ్రీరామకృష్ణ హిందు ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురు ప్రసాద్ కల్చరల్ ఫౌండేషన్ వారిచే స్వామి వివేకానంద నాటక ప్రదర్శన ఉంటుందన్నారు. సమావేశంలో కావూరి సత్యనారాయణ, వైకే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







