బూస్టర్డోస్గా జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ కు ఈయూ అనుమతి
- December 15, 2021
లండన్ : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ యూరోపియన్ యూనియన్లో విలయం సృష్టిస్తున్నది. కొత్త స్ట్రెయిన్ బారినపడ్డ ఓ వ్యక్తి ఇప్పటికే మరణించాడు.
ఈ క్రమంలో యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకున్నది. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన కొవిడ్-19 టీకాను బూస్టర్ డోసుగా వేసేందుకు అనుమతి ఇచ్చింది.
ఈయూ డ్రగ్ రెగ్యులేటర్ బుధవారం సిఫారసు చేసింది. ఫైజర్-బయోఎన్టెక్, మోడెర్నా టీకాలతో పాటు యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ (EMA) నిర్ధారించిన వ్యాక్సిన్ల (mRNA)లో ఏదైనా ఒక టీకా రెండు డోసులు తీసుకున్న తర్వాత మూడో డోసుగా జాన్సన్ అండ్ జాన్సన్ టీకా వేసేందుకు అనుమతి ఇచ్చింది. గత నెలలో దక్షిణాఫ్రికాలో గుర్తించిన కొత్త వేరియంట్తో యూకేలో ఓ వ్యక్తి మరణించిన అనంతరం ఆయూ దేశాలు ఆంక్షలు కఠినతరం చేస్తున్నాయి.
టీకాతో రక్షణ వస్తున్నందున బూస్టర్ డోస్లు వేసేందుకు నిర్ణయించింది. ఇప్పటికే ఈయూ మెడిసిన్స్ ఏజెన్సీ ఫైజర్, మోడెర్నా టీకా రెండు డోసులు తీసుకున్న ఆరు నెలల తర్వాత బూస్టర్ డోస్ వేసేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే ఆస్ట్రాజెనెకా టీకాను సైతం బూస్టర్ డోస్ వేసే అంశాన్ని పరిశీలిస్తున్నది.
తాజా వార్తలు
- తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా..బలపరీక్ష నెగ్గిన విజయ్ ప్రభుత్వం..
- పుదుచ్చేరి సీఎంగా రంగసామి రికార్డు
- గల్ఫ్ ఎయిర్ ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్..!!
- ఎస్టోనియా, డచ్ మంత్రులతో సయ్యద్ బదర్ చర్చలు..!!
- ప్రాంతీయ భద్రతా పై చర్చించిన సౌదీ, ఖతార్..!!
- ఇరాన్ తో సంబంధం ఉన్న సముద్ర చొరబాటుదారులు అరెస్ట్..!!
- 21 మంది వ్యక్తులు, సంస్థలను ఉగ్రవాదుల జాబితాలో చేర్చిన యూఏఈ..!!
- Metrash ద్వారా QPost ట్రాకింగ్ సేవలు..!!
- కష్టపడే వారికే పదవులు: కేసీఆర్
- ఉత్తర అల్ బతీనాహ్లో అంబులెన్స్ ప్రమాదం









