సముద్రంలో చిక్కుకుపోయిన ఐదుగురు ఇరాన్ పౌరులను కాపాడిన ఒమన్ ఎయిర్ ఫోర్స్

- December 16, 2021 , by Maagulf
సముద్రంలో చిక్కుకుపోయిన ఐదుగురు ఇరాన్ పౌరులను కాపాడిన ఒమన్ ఎయిర్ ఫోర్స్

ఒమన్: ఒమన్ ఎయిర్ ఫోర్స్ ఐదుగురు ఇరాన్ పౌరులను రక్షించింది. సముద్రం మధ్యలో  వారు ప్రయాణిస్తున్న పడవ చెడిపోవడంతో ప్రమాదంలో చిక్కుకున్నారు. సమచారం అందుకున్న  ఒమన్ రాయల్ ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్, రాయల్ ఒమన్ పోలీస్ కు చెందిన కోస్ట్ గార్డ్ పోలీసుల సమన్వయంతో ఐదుగురు ఇరాన్ పౌరులను కాపాడింది. వీరిలో ఇద్దరికి మస్కట్ గవర్నరేట్‌లోని ఖవ్లా హాస్పిటల్ లో ఆరోగ్య పరీక్షలు చేయించారు. స్వల్పంగా  గాయపడిన ముగ్గురికి మస్కట్ గవర్నరేట్‌లోని సుల్తాన్ కబూస్ పోర్ట్ లోని హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com