బూస్టర్ డోస్ తో ఒమిక్రాన్ కు చెక్
- December 16, 2021
యూఏఈ: అర్హులైన వారంతా బూస్టర్ డోస్ తీసుకోవాలని నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NCEMA) కోరింది. బూస్టర్ డోస్ తో ఒమిక్రాన్ లాంటి వేరియంట్లను సమర్థవంతంగా ఎదుర్కొవచ్చని తెలిపింది. NCEMA డాక్టర్ తాహెర్ అల్ అమిరి మాట్లాడుతూ.. బూస్టర్ డోస్ తీసుకోవడం ద్వారా వైరస్ తో పోరాడటానికి అవసరమైన యాంటీ బాడీలు ప్రొడ్యూస్ అవుతాయన్నారు. బూస్టర్ డోస్ తీసుకున్న వారికి ఒమిక్రాన్ సోకే అవకాశం తక్కువని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) చేసిన అధ్యయనాలు చెబుతున్నాయన్నారు. దేశంలో ప్రస్తుతం 18 ఏళ్లు పైబడి, వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకొని ఆరు నెలల దాటితే బూస్టర్ షాట్లను తీసుకునేందుకు అర్హులన్నారు. మసాచుసెట్స్ జనరల్ హాస్పిటల్ (MGH), హార్వర్డ్, MIT పరిశోధనల ప్రకారం.. రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ అది ఒమిక్రాన్ ను సమర్థంగా అడ్డుకోలేదని, బూస్టర్ షాట్ తీసుకోవడం ద్వారానే ఒమిక్రాన్ ను అడ్డుకునే రక్షణ వ్యవస్థ రూపొందుతుందన్నారు. మోడర్నా లేదా ఫైజర్/బయోఎన్టెక్ రెండు డోసులు, జాన్సన్ అండ్ జాన్స్ సింగిల్ డోస్ తీసుకున్న వారిపై వారిపై రీసెర్చ్ చేయగా వారికి ఒమిక్రాన్ సోకే అవకాశం ఉన్నట్లు తేలిందని...బూస్టర్ డోస్ ద్వారానే దాన్నిఒమిక్రాన్ నుంచి రక్షణ పొందవచ్చని తేలిందని NCEMA డాక్టర్ తాహెర్ తెలిపారు. బూస్టర్ డోస్ విషయంలో నిర్లక్ష్యం పనికి రాదన్నారు.
తాజా వార్తలు
- కష్టపడే వారికే పదవులు: కేసీఆర్
- ఉత్తర అల్ బతీనాహ్లో అంబులెన్స్ ప్రమాదం
- IPL 2026: సన్రైజర్స్ హైదరాబాద్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
- అనుమతి లేని ఎయిర్లైన్స్తో టికెట్లు బుక్ చేయవద్దు: కువైట్ DGCA హెచ్చరిక
- ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక అడుగు
- రష్యా వీసా ఖర్చుల భారం లేకుండా ట్రిప్ ప్లాన్
- యూఏఈలో రేపటి వాతావరణం ప్రశాంతం
- ఆన్లైన్ క్లాసులు నిర్వహించండి..స్కూళ్లకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి
- భారత దేశవ్యాప్తంగా NEET పరీక్ష రద్దు..కేంద్రం సంచలన నిర్ణయం
- తమిళనాడులో సీఎం విజయ్ షణ్ముగంతో కీలక భేటీ









