చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ గా సైన్యాధిపతి జనరల్ నరవణెకు బాధ్యతలు
- December 16, 2021
న్యూ ఢిల్లీ: చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ గా సైన్యాధిపతి జనరల్ M.M. నరవణె బాధ్యతలు చేపట్టారు. సాధారణంగా ఈ కమిటీకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఛైర్మన్ గా ఉంటారు.
ప్రస్తుత CDS జనరల్ బిపిన్ రావత్ మరణంతో ఖాళీగా ఉన్న ఈ స్థానంలో త్రివిధ దళాల అధిపతుల్లో సీనియర్ అయిన నరవణెను కమిటీ ఛైర్మన్ గా నియమించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. CDS పదవిని సృష్టించక ముందు మూడు దళాల అధిపతుల్లో సీనియర్ గా ఉన్న వ్యక్తి ఛైర్మన్ గా వ్యవహరించేవారు. ఆర్మీ, వాయుసేన, నావికా దళాల అధ్యక్షులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఎయిర్ చీఫ్ మార్షల్ VR చౌధరి సెప్టెంబర్ 30న వాయుసేనాధిపతిగా బాధ్యతలు స్వీకరించగా. నేవీ చీఫ్ గా అడ్మిరల్ R.హరికుమార్.నవంబర్ 30న పదవిలోకి వచ్చారు. జనరల్ నరవణె మాత్రం.2019 డిసెంబర్ నుంచి ఆర్మీ చీఫ్ గా కొనసాగుతున్నారు.
తాజా వార్తలు
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!









