చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ గా సైన్యాధిపతి జనరల్ నరవణెకు బాధ్యతలు
- December 16, 2021
న్యూ ఢిల్లీ: చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ ఛైర్మన్ గా సైన్యాధిపతి జనరల్ M.M. నరవణె బాధ్యతలు చేపట్టారు. సాధారణంగా ఈ కమిటీకి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఛైర్మన్ గా ఉంటారు.
ప్రస్తుత CDS జనరల్ బిపిన్ రావత్ మరణంతో ఖాళీగా ఉన్న ఈ స్థానంలో త్రివిధ దళాల అధిపతుల్లో సీనియర్ అయిన నరవణెను కమిటీ ఛైర్మన్ గా నియమించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. CDS పదవిని సృష్టించక ముందు మూడు దళాల అధిపతుల్లో సీనియర్ గా ఉన్న వ్యక్తి ఛైర్మన్ గా వ్యవహరించేవారు. ఆర్మీ, వాయుసేన, నావికా దళాల అధ్యక్షులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఎయిర్ చీఫ్ మార్షల్ VR చౌధరి సెప్టెంబర్ 30న వాయుసేనాధిపతిగా బాధ్యతలు స్వీకరించగా. నేవీ చీఫ్ గా అడ్మిరల్ R.హరికుమార్.నవంబర్ 30న పదవిలోకి వచ్చారు. జనరల్ నరవణె మాత్రం.2019 డిసెంబర్ నుంచి ఆర్మీ చీఫ్ గా కొనసాగుతున్నారు.
తాజా వార్తలు
- కష్టపడే వారికే పదవులు: కేసీఆర్
- ఉత్తర అల్ బతీనాహ్లో అంబులెన్స్ ప్రమాదం
- IPL 2026: సన్రైజర్స్ హైదరాబాద్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
- అనుమతి లేని ఎయిర్లైన్స్తో టికెట్లు బుక్ చేయవద్దు: కువైట్ DGCA హెచ్చరిక
- ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక అడుగు
- రష్యా వీసా ఖర్చుల భారం లేకుండా ట్రిప్ ప్లాన్
- యూఏఈలో రేపటి వాతావరణం ప్రశాంతం
- ఆన్లైన్ క్లాసులు నిర్వహించండి..స్కూళ్లకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి
- భారత దేశవ్యాప్తంగా NEET పరీక్ష రద్దు..కేంద్రం సంచలన నిర్ణయం
- తమిళనాడులో సీఎం విజయ్ షణ్ముగంతో కీలక భేటీ









