అంతు చిక్కని వ్యాధితో 100 మంది మృతి...
- December 16, 2021
సుడాన్: అంతు చిక్కని వ్యాధితో సుడాన్ దేశం అల్లాడి పోతోంది..ఇప్పటికే 100 మంది మృతి చెందారని స్వీడాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. మిస్టరీ వ్యాధి కలవరపెట్టిన తరువాత ప్రపంచ ఆరోగ్య సంస్థ టాస్క్ ఫోర్స్ బృందాన్ని దక్షిణ సూడాన్కు పంపించింది.ఈ వ్యాధితో జోంగ్లీ రాష్ట్రంలోని ఫంగాక్లో దాదాపు 100 మంది మరణించారు. స్థానిక అధికారుల సమాచారం ప్రకారం, వ్యాధిగ్రస్తుల ప్రాథమిక నమూనాలు కలరాకు సంబంధించిన లక్షణాలుగా బయటపడ్డాయని తెలిపారు.
ఈ ప్రాంతంలో తీవ్ర వరదలు ఉండటమే ఇందుకు కారణం. వారిని రాజధాని జుబాకు తీసుకురావడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని WHO అధికారి షీలా బయా తెలిపారు. దాదాపు 60 ఏళ్లుగా దేశంలో సంభవించిన అతి పెద్ద వరదల కారణంగా 700,000 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని UNHCR ఇంతకు ముందు పేర్కొంది. వరదలు రాకపోకలను నిలిపివేసింది .ఆహారం, ఇతర నిత్యావసరాలకు తీవ్ర కొరత ఏర్పడింది. దీంతో ఇక్కడి జనాభాలో పోషకాహార లోపం స్పష్టంగా కనబడుతోంది.
సరిహద్దు రాష్ట్రమైన యూనిటీ కూడా వరదల వల్ల తీవ్రంగా ప్రభావితమైందని రాష్ట్ర భూ, గృహ, ప్రజా వినియోగ శాఖ మంత్రి లామ్ తుంగ్వార్ కుయిగ్వాంగ్ తెలిపారు. దీంతో మలేరియా వంటి వ్యాధుల వ్యాప్తి పెరిగిందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- కష్టపడే వారికే పదవులు: కేసీఆర్
- ఉత్తర అల్ బతీనాహ్లో అంబులెన్స్ ప్రమాదం
- IPL 2026: సన్రైజర్స్ హైదరాబాద్ పై గుజరాత్ టైటాన్స్ ఘన విజయం
- అనుమతి లేని ఎయిర్లైన్స్తో టికెట్లు బుక్ చేయవద్దు: కువైట్ DGCA హెచ్చరిక
- ట్రాన్స్జెండర్ల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక అడుగు
- రష్యా వీసా ఖర్చుల భారం లేకుండా ట్రిప్ ప్లాన్
- యూఏఈలో రేపటి వాతావరణం ప్రశాంతం
- ఆన్లైన్ క్లాసులు నిర్వహించండి..స్కూళ్లకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి
- భారత దేశవ్యాప్తంగా NEET పరీక్ష రద్దు..కేంద్రం సంచలన నిర్ణయం
- తమిళనాడులో సీఎం విజయ్ షణ్ముగంతో కీలక భేటీ









