ఐశ్వర్యరాయ్‌కు ఈడీ సమన్లు

- December 20, 2021 , by Maagulf
ఐశ్వర్యరాయ్‌కు ఈడీ సమన్లు

పనామా పేపర్స్ కేసులో బచ్ఛన్ ఫ్యామిలీకి కష్టాలు పెరుగుతున్నట్లు కనిపిస్తుంది.

సోమవారం బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ ఢిల్లీలోని లోక్‌నాయక్ భవన్ లో ఈడీ ఆఫీసు ముందు హాజరుకావాల్సి ఉంది. విచారణలో భాగంగా ఇప్పటికే ఈడీ అధికారులు ప్రశ్నలు సిద్ధం చేసుకున్నారు. ఈ పనామా పేపర్స్ కేసులో 500మంది ఇన్వాల్వ్ అయి ఉన్నట్లు సమాచారం.

లీడర్లు, నటులు, క్రీడాకారులు, వ్యాపారస్థుల్లాంటి ప్రముఖుల పేర్లన్నీ అందులో ఉన్నాయి. ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు గానూ ప్రత్యామ్న్యాయాలను ఎన్నుకోవడమే దీనికి కారణం. అందులో వాస్తవాలు ఏ మేరకు ఉన్నాయోనని విచారణ జరుపుతున్నారు ఈడీ అధికారులు.

నెల క్రితం అభిషేక్ బచ్ఛన్ కూడా ఈ విచారణలో పాల్గొన్నారు. కొన్ని డాక్యుమెంట్లను కూడా ఆ సమయంలో సబ్ మిట్ చేశారు. త్వరలో అమితాబ్ బచ్ఛన్ కు కూడా ఈడీ నోటీసులు అందుతాయని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com