భారతీయులకు ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన..
- December 20, 2021
కువైట్ సిటీ: కువైట్ లోని ఇండియన్ ఎంబసీ కీలక ప్రకటన చేసింది.ఈ నెల 22న ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపింది. మధ్యహ్నం 3.30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొంది.కువైట్ లో పని చేస్తున్న ఇంజినీర్లు, నర్సుల సమస్యలపై ఈ కార్యక్రమంలో అంబాసిడర్ సిబి జార్జి చర్చించనున్నట్టు తెలిపింది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు.. ఎంబసీ కార్యలయంలోని ఆడిటోరియంలో ఏర్పాటు చేసే ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరుకావొచ్చని తెలిపింది. ఓపెన్ హౌస్ కార్యక్రమంలో ఆన్లైన్ ద్వారా పాల్గొనదలచిన భారతీయులు [email protected]కు మొయిల్ పంపి రిజిస్టర్ చేసుకోవాలని సూచించింది. భారతీయులు ఎవరైనా ఇతర సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే.. వారి సమస్యను పాస్పోర్ట్ నెంబర్, పేరు, సివిల్ ఐడీ నెంబర్, ఫోన్ నంబర్ వివరాలతో మెయిల్ చేయాలని తెలిపింది.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై కేంద్రం కీలక నిర్ణయం
- కార్మికులకు మే డే శుభాకాంక్షలు చెప్పిన కేసీఆర్
- యూఏఈలో పాఠశాలలకు 9 రోజుల ఈద్ అల్ అధా సెలవులు
- కార్మికులకు సీఎం రేవంత్ మేడే శుభాకాంక్షలు
- 2027 మార్చి 31 నాటికి తెలంగాణ నుంచి 1,000 వ్యాపారాలను గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యం
- IPL 2026: బెంగళూరు పై గుజరాత్ ఘనవిజయం!
- మంత్రులకు సీఎం చంద్రబాబు క్లాస్
- గల్ఫ్ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్









