ఏపీలో దిగ్గజ ఫార్మా కంపెనీ భారీ పెట్టుబడులు..
- December 28, 2021
ఏపీ: ఏపీలో దిగ్గజ ఫార్మా కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఆ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సన్ ఫార్మా ఒప్పందం కుదుర్చుకుంది.ఈ ఫార్మా కంపెనీ ఏర్పాటుతో దాదాపు 36 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.పరోక్షంగా భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు పొందనున్నారు. సన్ఫార్మా ఇంటిగ్రేటెడ్ ఎండ్ టూ ఎండ్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. మంగళవారం రాష్ట్ర క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో సన్ఫార్మా అధినేత దిలీప్ షాంఘ్వి కంపెనీ ఏర్పాటు లాంఛనాలపై చర్చలు జరిపారు. అనంతరం ప్లాంట్ ఏర్పాటుపై ప్రకటన చేశారు.రాష్ట్ర సమగ్రాభివృద్ధి, పర్యావరణ హిత విధానాలపై ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని, ఆయన ఆలోచనలు నన్ను ముగ్దుడ్నిచేశాయని దిలీప్ షాంఘ్వి అన్నారు.
కాగా, జనరిక్ ఫార్మా రంగంలో ప్రపంచంలోనే నాలుగో పెద్ద కంపెనీగా ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే హెల్త్కేర్ రంగంలో హైక్వాలిటీ మెడిసిన్ తక్కువ ధరలకే తయారు చేసే కంపెనీ ఇది. 100కు పైగా దేశాల్లో సన్ఫార్మా మందులను వినియోగిస్తున్నారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







