2-3 రోజుల్లో ఒమిక్రాన్ రెట్టింపు అయ్యే అవకాశం: WHO
- December 29, 2021
జెనీవా: గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పటికే పలు దేశాలకు వ్యాప్తి చెందింది.అగ్రదేశమైన అమెరికాతో పాటు యావత్తు ప్రపంచ దేశాలు ఒమిక్రాన్ కంటే ముందు వచ్చిన డెల్టా వేరియంట్తోనే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నాయి.అయితే ఇప్పుడు ఒమిక్రాన్ సోకిన దేశాల్ల విజృంభిస్తోంది.ఇటీవల భారత్లోకి కూడా ఈ వేరియంట్ ప్రవేశించి భారతీయులపై విరుచుకుపడుతోంది.
అయితే తాజాగా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులపై డబ్ల్యూహెచ్వో స్పందించింది.డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా విజృంభిస్తోందని, ఇప్పటికే యూకే,యూఎస్ దేశాలలో ఒమిక్రాన్ మరణాలు కూడా సంభవిస్తున్నాయని వెల్లడించింది.అయితే డిసెంబర్ 20 నుంచి 26 వరకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య అనుహ్యంగా పెరిగిందని, అంతేకాకుండా రానున్న 2-3 రోజుల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని తెలిపింది.ఇప్పటికే ఒమిక్రాన్పై జాగ్రత్త వహించాలని దేశాలకు సూచించనట్లు తెలిపింది.అయితే భారత్లో కూడా ఒమిక్రాన్ దాని ప్రభావాన్ని చూపుతోంది. నిన్న ఒక్క రోజే 127 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా గత వారం వరకు 7వేల లోపు నమోదైన కరోనా కేసులు తాజాగా 9వేలకు పైగా నమోదయ్యాయి.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







