భారత్లో కరోనా కేసుల వివరాలు
- December 30, 2021
న్యూ ఢిల్లీ:భారత్లో కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలతో పాటు భారత్ను సైతం వదలనంటోంది. కరోనా దాటికి ఇప్పటికే ప్రపంచ దేశాలు అతాలకుతలమవుతున్నాయి. ఇప్పడిప్పుడే డెల్టా వేరియంట్ భారత్లో తగ్గుముఖం పడుతుందనుకుంటున్న సమయంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగులోకి రావడంతో మరోసారి ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్లో రోజురోజు మరోసారి కోవిడ్ విజృంభన పెరుగుతోంది. గత వారం వరకు 7వేల లోపు నమోదైన కరోనా కేసులు ఇప్పటి రెట్టింపుగా నమోదవుతున్నాయి.
తాజాగా దేశవ్యాప్తంగా 13,154 కొత్త కరోనా కేసులు నమోదవగా, 268 మంది కరోనాతో మృతి చెందారు. ఇదే సమయంలో కరోనా నుంచి 7,486 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.దేశంలో ప్రస్తుతం 82,402 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ వేరియంట్ కూడా భారత్లో చాపకింద నీరులా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 961 కు చేరుకుంది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







