టాప్ ఫుడ్ బ్రాండ్ల పేరుతో ఫ్రాడ్.. అప్రమత్తమైన బహ్రెయిన్

- December 30, 2021 , by Maagulf
టాప్ ఫుడ్ బ్రాండ్ల పేరుతో ఫ్రాడ్.. అప్రమత్తమైన బహ్రెయిన్

బహ్రెయిన్: కస్టమర్లను తప్పుదారి పట్టించేలా సోషల్ మీడియాలో టాప్ ఫుడ్ బ్రాండ్ల పేరుతో మోసగాళ్ళు ఫ్రాడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బహ్రెయిన్ అప్రమత్తం అయింది. ఇలాంటి వాటిపై ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ద్వారా ఫిర్యాదులు స్వీకరించడం ప్రారంభించింది. అన్ని ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లలో కస్టమర్లను నమ్మించేలా బ్రాండ్ లోగోలు, పేర్లు పెడుతున్నారు. ఎక్కువ మంది కొనుగోలుదారులను ఆకర్షించేందుకు సోషల్ మీడియాలో "అన్ బిలీవబుల్ ఆఫర్లు" కూడా పోస్ట్ చేస్తునారు. వీటిపై ప్రముఖ బ్రాండ్ల కంపెనీ లు ఇప్పటికే పోలీసులను ఆశ్రయించారు. ఇలాంటి ఆఫర్ల బారిన పడి చాలా మంది మోసపోయి పోలీసులకు ఫిర్యాదులు చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com