మార్చ్ 27న రామ్చరణ్ పుట్టిన రోజు సంధర్భముగా మెగా బ్లడ్ క్యాంప్
- March 25, 2016
చిరంజీవి తనయుడు రామ్చరణ్ తేజ్ పుట్టిన రోజుసందర్భంగా మార్చి 27వ తేదీన మెగా రక్తదాన శిబిరాన్ని భారీ స్థాయిలో నిర్వహించటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. చిరంజీవి చారిటబుల్ట్రస్టు ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అభిమానులను కోరుతున్నారు. హైదరాబాద్లోని ట్రస్టు కార్యాలయంతోపాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అదేరోజు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అత్యధిక సంఖ్యలో రక్తదానం చేయాలని అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి పిలుపునిచ్చారు. ఏకకాలంలో వేలాది యూనిట్ల రక్తాన్ని సేకరించి గిన్నిస్బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాలనే ఉద్దేశ్యంతోనే ఈ మెగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







