ప్రముఖుల సమక్షంలో మల్టీస్టారర్‌ మూవీ 'ఈడోరకం- ఆడోరకం' ఆడియో వేడుక

- March 25, 2016 , by Maagulf
ప్రముఖుల సమక్షంలో మల్టీస్టారర్‌ మూవీ 'ఈడోరకం- ఆడోరకం' ఆడియో వేడుక

ప్రస్తుతం టాలీవుడ్‌లో మల్టీ స్టారర్‌ ట్రెండ్‌ మరింతగా నడుస్తుంది. చిన్న హీరోలతో పాటు స్టార్‌ హీరోలు కూడా ఈ ప్రయోగాలకు సై అంటున్నారు. అయితే ఇటీవల మంచు విష్ణు, రాజ్‌ తరుణ్‌ కాంబినేషన్‌లో జి.నాగేశ్వర్‌ రెడ్డి ఈడోరకం- ఆడోరకం అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విష్ణు సరసన సోనారిక నటిస్తుండగా, రాజ్ తరుణ్‌తో హెబ్బా పటేల్‌ జత కట్టింది. ఈ చిత్ర ఆడియో వేడుకను గ్రాండ్‌ గా నిర్వహించి సినిమాకు మంచి ప్రమోషన్ అయ్యేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.రామబ్రహ్మం సుంకర నిర్మాణంలో తెరకెక్కిన ఈడోరకం- ఆడోరకం చిత్రంకు సంబంధించి టైటిల్‌, ఫస్ట్‌ లుక్ ని ఇటీవల విడుదల చేసారు. వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అవుట్‌ అండ్‌ అవుట్‌ కామెడీ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్‌ సంగీతాన్ని అందించగా మార్చి 26న ఈ చిత్ర ఆడియో వేడుక జరపాలని యూనిట్‌ భావిస్తుంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులను కూడా ఆహ్వానించినట్టు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com