ప్రముఖుల సమక్షంలో మల్టీస్టారర్ మూవీ 'ఈడోరకం- ఆడోరకం' ఆడియో వేడుక
- March 25, 2016
ప్రస్తుతం టాలీవుడ్లో మల్టీ స్టారర్ ట్రెండ్ మరింతగా నడుస్తుంది. చిన్న హీరోలతో పాటు స్టార్ హీరోలు కూడా ఈ ప్రయోగాలకు సై అంటున్నారు. అయితే ఇటీవల మంచు విష్ణు, రాజ్ తరుణ్ కాంబినేషన్లో జి.నాగేశ్వర్ రెడ్డి ఈడోరకం- ఆడోరకం అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో విష్ణు సరసన సోనారిక నటిస్తుండగా, రాజ్ తరుణ్తో హెబ్బా పటేల్ జత కట్టింది. ఈ చిత్ర ఆడియో వేడుకను గ్రాండ్ గా నిర్వహించి సినిమాకు మంచి ప్రమోషన్ అయ్యేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.రామబ్రహ్మం సుంకర నిర్మాణంలో తెరకెక్కిన ఈడోరకం- ఆడోరకం చిత్రంకు సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ ని ఇటీవల విడుదల చేసారు. వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.
అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతాన్ని అందించగా మార్చి 26న ఈ చిత్ర ఆడియో వేడుక జరపాలని యూనిట్ భావిస్తుంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులను కూడా ఆహ్వానించినట్టు సమాచారం.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







