ఇంకా ఐసీయూ లోనే లతా మంగేష్కర్..హెల్త్ బులిటెన్ రిలీజ్!
- January 12, 2022
ప్రముఖ గాయని లతా మంగేష్కర్.. నిన్న కరోనా బారీన పడ్డ సంగతి తెలిసిందే. దీంతో గాయని లతా మంగేష్కర్ ను ముంబై లోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ కు ఆమె కుటుంబ సభ్యులు తరలించారు.
ప్రస్తుతం గాయని లతా మంగేష్కర్ ను ఐసీయూలో ఉంచారు. అయితే… తాజాగా గాయని లతా మంగేష్కర్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ వైద్యులు.
"గాయకురాలు లతా మంగేష్కర్ ICU వార్డులో చికిత్స పొందుతున్నారు. ఆమె మరో 10-12 రోజుల పాటు ఐసీయూలోనే ఉంటారు. ఆమె కోవిడ్తో పాటు, న్యుమోనియాతో కూడా బాధపడుతున్నారు. ఆమెకు మంచి వైద్యం అందిస్తున్నాం" అని బ్రీచ్ కాండీ ఆస్పత్రి డాక్టర్ ప్రతీత్ సంధాని చెప్పారు. ఇక అటు గాయని లతా మంగేష్కర్ మేనకోడలు రచన.. కూడా ఆమె ఆరోగ్యం పై స్పందించారు. "లతా మంగేష్కర్ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది. ఎవరు కూడా కంగారు పడొద్దు. ఆమె వయస్సు పెద్దది కనుక.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే… ఐసీయూలో ఉంచారు" అంటూ వెల్లడించింది రచన.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







