ఇంకా ఐసీయూ లోనే లతా మంగేష్కర్..హెల్త్ బులిటెన్ రిలీజ్!
- January 12, 2022
ప్రముఖ గాయని లతా మంగేష్కర్.. నిన్న కరోనా బారీన పడ్డ సంగతి తెలిసిందే. దీంతో గాయని లతా మంగేష్కర్ ను ముంబై లోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ కు ఆమె కుటుంబ సభ్యులు తరలించారు.
ప్రస్తుతం గాయని లతా మంగేష్కర్ ను ఐసీయూలో ఉంచారు. అయితే… తాజాగా గాయని లతా మంగేష్కర్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ వైద్యులు.
"గాయకురాలు లతా మంగేష్కర్ ICU వార్డులో చికిత్స పొందుతున్నారు. ఆమె మరో 10-12 రోజుల పాటు ఐసీయూలోనే ఉంటారు. ఆమె కోవిడ్తో పాటు, న్యుమోనియాతో కూడా బాధపడుతున్నారు. ఆమెకు మంచి వైద్యం అందిస్తున్నాం" అని బ్రీచ్ కాండీ ఆస్పత్రి డాక్టర్ ప్రతీత్ సంధాని చెప్పారు. ఇక అటు గాయని లతా మంగేష్కర్ మేనకోడలు రచన.. కూడా ఆమె ఆరోగ్యం పై స్పందించారు. "లతా మంగేష్కర్ ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది. ఎవరు కూడా కంగారు పడొద్దు. ఆమె వయస్సు పెద్దది కనుక.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే… ఐసీయూలో ఉంచారు" అంటూ వెల్లడించింది రచన.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









