రోజురోజుకి పెరుగుతున్న మృతుల సంఖ్య : ఇరాక్
- March 26, 2016
ఇరాక్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 41కి చేరింది. ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఇప్పటికే ప్రకటించింది. శుక్రవారం ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని సాకర్ మైదానంలో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఇరాక్లోని అల్అసద్ మిలిటరీ స్థావరంపై శనివారం ఐఎస్ ఆత్మాహుతి దళాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో ముగ్గురు ఇరాకీ సైనికులు మృతిచెందారు. మిలిటరీ స్థావరంలో వందమందిపైగా సంకీర్ణ సలహాదారులు సమావేశమైన సమయంలో దాడులు చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. నలుగురు ఐఎస్ ఆత్మాహుతి సభ్యులు దాడులకు ప్రయత్నించారని, తమను తాము పేల్చుకోవడంతో ముగ్గురు ఇరాకీ సైనికులు మృతిచెందారని అల్జజీరా ఆపరేషన్స్ కమాండ్ మేజర్ జనరల్ అలీ ఇబ్రహిం డబౌన్ తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







