రోజురోజుకి పెరుగుతున్న మృతుల సంఖ్య : ఇరాక్‌

- March 26, 2016 , by Maagulf
రోజురోజుకి పెరుగుతున్న మృతుల సంఖ్య : ఇరాక్‌

ఇరాక్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 41కి చేరింది. ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఇప్పటికే ప్రకటించింది. శుక్రవారం ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని సాకర్ మైదానంలో ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఇరాక్‌లోని అల్‌అసద్ మిలిటరీ స్థావరంపై శనివారం ఐఎస్ ఆత్మాహుతి దళాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో ముగ్గురు ఇరాకీ సైనికులు మృతిచెందారు. మిలిటరీ స్థావరంలో వందమందిపైగా సంకీర్ణ సలహాదారులు సమావేశమైన సమయంలో దాడులు చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. నలుగురు ఐఎస్ ఆత్మాహుతి సభ్యులు దాడులకు ప్రయత్నించారని, తమను తాము పేల్చుకోవడంతో ముగ్గురు ఇరాకీ సైనికులు మృతిచెందారని అల్‌జజీరా ఆపరేషన్స్ కమాండ్ మేజర్ జనరల్ అలీ ఇబ్రహిం డబౌన్ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com