రోజురోజుకి పెరుగుతున్న మృతుల సంఖ్య : ఇరాక్
- March 26, 2016ఇరాక్లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మృతుల సంఖ్య 41కి చేరింది. ఈ ఘటనకు తామే బాధ్యులమంటూ ఐఎస్ ఉగ్రవాద సంస్థ ఇప్పటికే ప్రకటించింది. శుక్రవారం ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని సాకర్ మైదానంలో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఇరాక్లోని అల్అసద్ మిలిటరీ స్థావరంపై శనివారం ఐఎస్ ఆత్మాహుతి దళాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో ముగ్గురు ఇరాకీ సైనికులు మృతిచెందారు. మిలిటరీ స్థావరంలో వందమందిపైగా సంకీర్ణ సలహాదారులు సమావేశమైన సమయంలో దాడులు చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. నలుగురు ఐఎస్ ఆత్మాహుతి సభ్యులు దాడులకు ప్రయత్నించారని, తమను తాము పేల్చుకోవడంతో ముగ్గురు ఇరాకీ సైనికులు మృతిచెందారని అల్జజీరా ఆపరేషన్స్ కమాండ్ మేజర్ జనరల్ అలీ ఇబ్రహిం డబౌన్ తెలిపారు.
తాజా వార్తలు
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..
- కాలిఫోర్నియా లాంగ్ బీచ్లో కాల్పుల కలకలం
- ఉమ్ రామూల్, అల్ బర్షాలోని ఆర్టీఏ కేంద్రాలు అప్గ్రేడ్
- దుబాయ్ కు పోటెత్తుతున్న భారతీయులు..!
- సౌదీ రాజుకు HM సుల్తాన్ సంతాపం
- టాప్ 20 ప్రపంచ కార్ మార్కెట్లలో సౌదీ అరేబియా
- ఇన్వెస్ట్ స్కామ్..బౌన్స్ చెక్కు జారీ చేసిన వ్యక్తికి జైలు శిక్ష
- యూఏఈలో వేసవి ప్రారంభం వరకు వర్షాలు..!
- ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్..