దాడులకు పాల్పడింది తామేనని ఐఎస్ ఉగ్రవాద సంస్థ : యెమెన్
- March 26, 2016
యెమెన్లోని ఆడెన్ నగరంలో జరిగిన వరుస ఆత్మాహుతి దాడుల్లో 26మంది మృతి చెందగా, మరికొంతమంది గాయపడ్డారు. వీరిలో 10 మంది సాధారణ పౌరులుకాగా, 16 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ దాడులకు పాల్పడింది తామేనని ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అంతర్యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ దాడులకు తెగబడినట్ట్టు సమాచారం. శుక్రవారం బురైఖా ప్రాంతంలోని చెక్పాయింట్ వద్ద భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా పేలుడు పదార్థాలతో వచ్చిన ఓ అంబులెన్సును గుర్తించారు. అంబులెన్స్ డోర్ తెరిచేలోపే అందులో ఉన్న వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నాడు.ఈ ఘటనలో 14 మంది మృతిచెందారు. మరికొద్దిసేపటికే చెక్పాయింట్ సమీపంలో మరో రెండు ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనలో 12మంది మృతిచెందగా, పలువురు గాయపడినట్టు అధికారులు వెల్లడించారు.-కిడ్నాప్ అయిన కేరళవాసిని విడిపించేందుకు చర్యలుఈనెల 4న యెమెన్లో ఉగ్రవాదులు అపహరించారని భావిస్తున్న కేరళకు చెందిన ఫాదర్ ఉజున్నలిల్ను విడిపించేందుకు కృషి చేస్తున్నట్టు భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. గుడ్ఫ్రైడే సందర్భంగా ఉజున్నలిల్ను చంపేందుకు ఉగ్రవాదులు పథకం వేసుకున్నారని, అయితే అందుకు సంబంధించిన ఎలాంటి సమాచారం తమకు అందలేదన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







