దాడులకు పాల్పడింది తామేనని ఐఎస్ ఉగ్రవాద సంస్థ : యెమెన్
- March 26, 2016యెమెన్లోని ఆడెన్ నగరంలో జరిగిన వరుస ఆత్మాహుతి దాడుల్లో 26మంది మృతి చెందగా, మరికొంతమంది గాయపడ్డారు. వీరిలో 10 మంది సాధారణ పౌరులుకాగా, 16 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ దాడులకు పాల్పడింది తామేనని ఐఎస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. అంతర్యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ దాడులకు తెగబడినట్ట్టు సమాచారం. శుక్రవారం బురైఖా ప్రాంతంలోని చెక్పాయింట్ వద్ద భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా పేలుడు పదార్థాలతో వచ్చిన ఓ అంబులెన్సును గుర్తించారు. అంబులెన్స్ డోర్ తెరిచేలోపే అందులో ఉన్న వ్యక్తి తనను తాను పేల్చేసుకున్నాడు.ఈ ఘటనలో 14 మంది మృతిచెందారు. మరికొద్దిసేపటికే చెక్పాయింట్ సమీపంలో మరో రెండు ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ ఘటనలో 12మంది మృతిచెందగా, పలువురు గాయపడినట్టు అధికారులు వెల్లడించారు.-కిడ్నాప్ అయిన కేరళవాసిని విడిపించేందుకు చర్యలుఈనెల 4న యెమెన్లో ఉగ్రవాదులు అపహరించారని భావిస్తున్న కేరళకు చెందిన ఫాదర్ ఉజున్నలిల్ను విడిపించేందుకు కృషి చేస్తున్నట్టు భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. గుడ్ఫ్రైడే సందర్భంగా ఉజున్నలిల్ను చంపేందుకు ఉగ్రవాదులు పథకం వేసుకున్నారని, అయితే అందుకు సంబంధించిన ఎలాంటి సమాచారం తమకు అందలేదన్నారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్