ఏప్రిల్ 1న ‘ఆచార్య’
- January 16, 2022హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ‘ఆచార్య’. ఈ సినిమాలో కాజల్, పూజా హెగ్డేలు హీరోయిన్స్ గానటిస్తునారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే ఈ సినిమాని ఫిబ్రవరి 4న రిలీజ్ చేద్దామని భావించారు.
కానీ కరోనా కారణంగా ఈ సినిమాని వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర బృందం. సమ్మర్ బరిలో ఈ సినిమాని నిలపబోతున్నారు. ఏప్రిల్ 1న ఆచార్య సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. సంక్రాంతికి రావాల్సిన సినిమాలన్నీ సమ్మర్ కి వాయిదా పడ్డాయి. దీంతో ఈ సారి వేసవిలో సినిమాల మధ్య పోటీతో పాటు వినోదం మరింత పెరగనుంది.
తాజా వార్తలు
- గాల్లో ఢీకొన్నరెండు హెలీకాప్టర్లు..10 మంది మృతి
- గ్లోబల్ విలేజ్ బంపరాఫర్..ఇక వారికి ఉచితం..!
- 3వేలకు పైగా చిల్డ్రన్ స్వీట్స్ సీజ్
- బహ్రెయిన్ లో డిజిటల్ తరగతుల పొడిగింపు
- వారికి వీసా ఓవర్స్టే జరిమానాలు లేవు..!
- 'క్షమాభిక్ష'ను వినియోగించుకున్న 6,300 మంది ప్రవాసులు
- సుడాన్ ఆరోపణలను ఖండించిన యూఏఈ
- నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి: ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి
- వరంగల్ విమానాశ్రయం పై కదలిక
- ఆ రాష్ట్రాలకు IMD వార్నింగ్