ఏప్రిల్ 1న ‘ఆచార్య’

- January 16, 2022 , by Maagulf
ఏప్రిల్ 1న ‘ఆచార్య’

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా ‘ఆచార్య’. ఈ సినిమాలో కాజల్, పూజా హెగ్డేలు హీరోయిన్స్ గానటిస్తునారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. అయితే ఈ సినిమాని ఫిబ్రవరి 4న రిలీజ్ చేద్దామని భావించారు.

కానీ కరోనా కారణంగా ఈ సినిమాని వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు చిత్ర బృందం. సమ్మర్ బరిలో ఈ సినిమాని నిలపబోతున్నారు. ఏప్రిల్ 1న ఆచార్య సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. సంక్రాంతికి రావాల్సిన సినిమాలన్నీ సమ్మర్ కి వాయిదా పడ్డాయి. దీంతో ఈ సారి వేసవిలో సినిమాల మధ్య పోటీతో పాటు వినోదం మరింత పెరగనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com