తెలంగాణ: జనవరి 30 వరకు విద్యాసంస్థలు బంద్
- January 16, 2022
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెచ్చరికలు జారీచేసింది. ఇక రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవులు పొడిగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈమేరకు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ఆదివారం అధికారిక ప్రకటన చేశారు. విద్యాసంస్థలకు సెలవుల పొడిగింపుపై విద్యాశాఖ స్పందిస్తూ విద్యార్థులు నష్టపోకుండా విద్యాసంస్థలు చర్యలు చేపట్టాలని.. ఆమేరకు ఆన్ లైన్ లో తరుగతులను నిర్వహించుకోవాలి సూచించింది.
కాగా సంక్రాంతి సెలవులపై ప్రజలు సొంత ఊళ్లకు వెళ్లిన నేపథ్యంలో కరోనా వ్యాప్తిని నిలువరించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సీఎస్ సోమేశ్ కుమార్ వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. మరోవైపు 15 నుండి 18 ఏళ్ల వయసున్న బాలబాలికలకు కోవిడ్ వ్యాక్సినేషన్ చేపట్టాలని సీఎస్ పేర్కొన్నారు. వాక్సినేషన్ కు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ తగు ఏర్పాట్లు చేసుకోవాలని ప్రభుత్వ ఆదేశించింది.
తాజా వార్తలు
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!







