జిసిసిలో తొలిసారిగా కాసినో ప్రారంభించనున్న యూఏఈ
- January 26, 2022
యూఏఈ: హోటల్ మరియు కాసినో నిర్వాహణలో పేరున్న వియాన్ రిసార్ట్స్, త్వరలో రస్ అల్ ఖైమాలో లగ్జరీ రిసార్టుని నిర్మించనుంది. గేమింగ్ ఏరియాతో దీన్ని ఏర్పాటు చేస్తారు. తొలిసారిగా ఓ ముస్లిం గల్ప్ దేశంలో గ్యాంబ్లింగ్కి దీని ద్వారా లైన్ క్లియర్ అయినట్లు భావించాలి. గేమింగ్తోపాటుగా గ్యాంబ్లింగ్ కూడా వుంటుందా.? లేదా.? అన్నదానిపై వియాన్ సంస్థ స్పష్టత ఇవ్వాల్సి వున్నా, వినోదానికి సంబంధించి నిబంధనల్లో ఖచ్చితంగా మార్పులు రాబోతున్నాయని రస్ అల్ ఖైమా టూరిజం డెవలప్మెంట్ అథారిటీ పేర్కొంది. ఈ మేరకు కొత్త డిపార్టుమెంట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మరియు గేమింగ్ రెగ్యులేషన్ని కూడా ఏర్పాటు చేశారు. టూరిజం మరియు బిజినెస్ హబ్గా వున్న యూఏఈలో ఈ గ్యాంబ్లింగ్ గేమింగ్ సరికొత్త ట్రెండ్కి శ్రీకారం చుట్టనుంది. 2026 నాటికి వియాన్ సంస్థ ఈ వినోద కేంద్రాన్ని పూర్తి చేయనుంది. మానవ నిర్మిత ఐలాండ్ అల్ మర్జాన్లో దీన్ని ఏర్పాటు చేస్తారు.
తాజా వార్తలు
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త
- సౌదీ అరేబియాలో యాచనకు పాల్పడుతున్న పాక్ పౌరులపై వేటు
- తెలంగాణ: 325 పోలీస్ డ్రైవర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్..
- అన్నమాచార్య ప్రాజెక్టులో స్వరలయ ఆర్ట్స్ (సింగపూర్) భక్తిసంగీత వైభవం
- శాంతి బిల్లు 2025కు పార్లమెంట్ గ్రీన్ సిగ్నల్
- FIFA వరల్డ్ కప్ విజేతకు రూ.450 కోట్లు
- కుప్పకూలిన విమానం..ప్రముఖ రేసర్ కన్నుమూత
- కువైట్ లో జనవరి 1వ తేదీన సెలవు..!!







