త్వరలో ఈ-పాస్ పోర్ట్ విధానం:మంత్రి నిర్మల
- February 01, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో అతి త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో ఈ-పాస్పోర్ట్ విధానం తీసుకురానున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పౌరుల సౌకర్యం కోసం 2022-23లో ఈ-పాస్పోర్ట్ల జారీని ప్రారంభించనున్నట్లు చెప్పారు.
ఈ-పాస్పోర్ట్ ప్రధాన ఫీచర్లు
- సురక్షితమైన బయోమెట్రిక్ డేటా
- ప్రపంచవ్యాప్తంగా సులభతర ఇమ్మిగ్రేషన్ పాసేజ్
- చిప్ ట్యాంపర్ చేయబడితే.. పాస్ పోర్టు అథంటికేషన్ ఫెయిల్ అవుతుంది.
- ఎంబెడెడ్ చిప్లతో కూడిన ఈ-పాస్పోర్ట్ ను నాసిక్లోని ఇండియా సెక్యూరిటీ ప్రెస్లో తయారు చేస్తారు.
అంతేగాక అమెరికాలోని ప్రముఖ లేబొరేటరీలో మొదట ఈ ఈ-పాస్పోర్ట్ నమూనాను పూర్తిగా పరీక్షించి, ఎలాంటి లోటుపాట్లు లేవని తేలిన తర్వాతే వాడకంలోకి అనుమతిస్తారు.
ఎన్నో ప్రత్యేకతలతో ఈ డిజిటల్ పాస్పోర్ట్ రూపుదిద్దుకుంది.అలాగే ఈ-పాస్పోర్ట్ విధానం వల్ల నకిలీలను అరికట్టవచ్చు.ఈ కొత్త ఈ-పాస్పోర్ట్లో చాలా సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి కావున నకిలీ పాస్పోర్ట్లు వాడే వారిని నిలువరించే వీలు కలుగుతుంది.ఇక ఇమ్మిగ్రేషన్ కౌంటర్లలో వివరాలను వేగంగా వెరిఫై చేసేందుకు పాస్పోర్ట్లోని మైక్రో చిప్ చాలా ఉపయోగపడుతుంది.దీని ద్వారా ప్రయాణాలు చేసేటప్పుడు సమయం చాలా ఆదా అవుతుంది.
తాజా వార్తలు
- బర్కాలో డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో ముగ్గురు అరెస్ట్
- యూఏఈలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు
- తెలంగాణలోని మీసేవా కేంద్రాల్లో రూల్స్ మారాయ్..
- యూఏఈలో భారీ డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- నేరాల నియంత్రణ, బాధితులకు సత్వర న్యాయం పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యం: సీపీ డా.ఎం.రమేశ్
- సాయికృష్ణ కేసు పై సీబీఐ విచారణ జరగాలి: వైఎస్ జగన్
- ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్..
- ఏపీకి భారీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలికి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
- రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు శ్రీనివాస్ మృతి
- విటమిన్ డి లోపం రిస్క్ పై నిపుణులు హెచ్చరిక..!!









