కువైట్ లేబర్ మార్కెట్లో మొదటి ప్లేస్ లో ఈజిప్షియన్లు
- February 08, 2022
కువైట్ లేబర్ మార్కెట్లో మొదటి ప్లేస్ లో ఈజిప్షియన్లు
కువైట్: కువైట్ లో ఇండియన్, కువైట్ లేబర్ ఫోర్స్ ని అధిగమించి ఈజిప్టు లేబర్ ఫోర్స్ మొదటి స్థానంలో నిలిచింది. ఈ మేరకు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ సెప్టెంబరు 2021 డేటాను రిలీజ్ చేసింది. మొత్తం 456,600 మంది ఈజిప్టు మేల్-ఫీమేల్ కార్మికులు కువైట్ లో పనిచేస్తున్నారు. మొత్తం లేబర్ మార్కెట్ లో ఈజిప్షియన్ల వాటా 24% గా ఉంది. తర్వాతి స్థానాల్లో భారతీయ కార్మికులు 23.7%(451,300), కువైట్ కార్మికులు 22.3%(424,000) చొప్పున కార్మికులు పనిచేస్తున్నారు. బంగ్లాదేశ్ కార్మికులు మొత్తం 161,100(8.5%) మందితో నాల్గవ స్థానంలో ఉండగా.. ఆ తరువాత పాకిస్తాన్ కార్మికులు మొత్తం 70,300 (3.7%), ఫిలిపినో కార్మికులు మొత్తం 66,000 (3.5%), సిరియన్లు 63,200 (3.3%) చొప్పున కువైట్లో ఉపాధి పొందుతున్నారు. నేపాలీలు 2.1% (40,100), జోర్డానియన్లు 1.3% (25,200), ఇరానియన్లు 1.1%(20,300), ఇతర జాతీయుల సంఖ్య 6.6%(125,100) చొప్పున ఉన్నట్లు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి.
తాజా వార్తలు
- పాత నోట్ల మార్పిడికి సెప్టెంబర్ 21 డెడ్లైన్.. ఒమన్ సెంట్రల్ బ్యాంక్ కీలక ప్రకటన
- అబుదాబి నేచురల్ హిస్టరీ మ్యూజియాన్ని సందర్శించిన షేక్ మహమ్మద్
- గల్ఫ్ మెడికల్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- దుబాయ్ AIM కాంగ్రెస్లో మధ్యప్రదేశ్ పెట్టుబడి అవకాశాల ప్రదర్శన
- రూ.3 లక్షలు తిరిగి ఇచ్చిన కండక్టర్.. హజ్ యాత్రికుడి డబ్బును భద్రంగా అప్పగింత
- వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు!
- మొదటిసారి ఢిల్లీ బయట జాతీయ అవార్డుల వేడుక..!
- ఇది శాసనసభ కాదు.. దుశ్శాసన సభ: KTR
- జాబ్స్ పేరుతో కోట్లలో మోసం.. 'నందూస్ వరల్డ్' నందన అరెస్ట్..
- సౌదీతో భారత్ సంబంధాల బలోపేతంలో భారత కార్మికుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్







