అల్ తుమ్మ కూడలి తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపు
- March 30, 2016
అల్ తుమ్మ కూడలి పనులు పూర్తి చేయడానికి ఇ-రింగ్ వద్ద నజ్మా రోడ్లు అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా చివరి తారు పొర చేయడానికి, పబ్లిక్ వర్క్స్ అథారిటీ 'ఆశ్ఘల్ ' ఎనిమిది దశల్లో ఒక తాత్కాలిక ట్రాఫిక్ మళ్లింపు అమలు చేయనుంది.మొదటి దశ పనులు అర్ధరాత్రి తర్వాత గురువారం నాడు మొదలై శనివారం ఉదయం 5 వరకు కోనసాగుతుంది. మిగిలిన ఏడు దశల్లో ప్రతివారం గురువారం అర్ధరాత్రి నుంచి శనివారం 5 గంటలకు ఒకో దశ పూర్తికానుంది. ఈ పనులు ఏడు వారాంతాలలో నిర్వహించనున్నారు. ఈ పనులకు చివరి దశ మే 21 నాటికి పూర్తవుతుందని అంచనా వెయ్యబడింది.ప్రతి దశలో, కూడలి యొక్క ఒక భాగం మాత్రమే మూసివేయబడతాయి మరియు చిహ్నాలు పటంలో చూపిన విధంగా ఎక్కడ మూసి ఉంటుందని తెలిపారు. అదేవిధంగా రహదారి తెరవబడిన భాగాలను అందులో సూచిస్తుంది ఆ విధంగా బోర్డు ఏర్పాటుచేస్తారు . కూడలి చివరి దశ పనులు సమీపించేసరికి రెండు రోజులు మినహా అక్కడ పూర్తి మూసివేత అవసరం ఉంటుంది.ఆశ్ఘల్ లో, వాహనదారులు రహదారి మళ్లింపు సలహా చిహ్నాలను ఏర్పాటుచేయనున్నారు . వేగ పరిమితులు కట్టుబడి ఉండాలని భద్రత చర్యలు నిర్ధారించడానికి రహదారి చిహ్నాలను అనుసరించండని అధికారకంగా రహదారి వినియోగదారులను ఈ సందర్భంగా అభ్యర్థించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







