భారత్ లో శ్రీలంక జట్టు పర్యటన వివరాలు ప్రకటించిన BCCI...

- February 15, 2022 , by Maagulf
భారత్ లో శ్రీలంక జట్టు పర్యటన వివరాలు ప్రకటించిన BCCI...

భారత్ లో మూడు టి20లు, రెండు టెస్టులు ఆడేందుకు శ్రీలంక జట్టు వస్తోంది.ఈ పర్యటనలో మార్పు చేసినట్టు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నేడు వెల్లడించింది.ఈ మేరకు సవరించిన షెడ్యూల్ ను ప్రకటించింది.శ్రీలంక జట్టు భారత్ లో తొలుత 3 మ్యాచ్ ల టి20 సిరీస్ లో పాల్గొంటుందని, ఆ తర్వాత ఐసీసీ టెస్టు చాంపియన్ షిప్ లో భాగంగా రెండు టెస్టుల సిరీస్ జరుగుతుందని వివరించింది.

ఈ క్రమంలో లక్నో తొలి టి20 మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తుందని, మిగిలిన రెండు టి20 మ్యాచ్ లు ధర్మశాలలో జరుగుతాయని బోర్డు పేర్కొంది. ఇక, ఇరు జట్ల మధ్య తొలి టెస్టు మొహాలీలో మార్చి 4 నుంచి 8వరకు జరుగుతుందని, రెండో టెస్టు మార్చి 12 నుంచి 16 వరకు బెంగళూరు వేదికగా జరుగుతుందని వివరించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com