డోర్ టు డోర్ కార్గో సర్వీసు రుసుము పెంపు
- March 30, 2016
ఒమన్ నుంచి ఇండియాకి డోర్ టు డోర్ కార్గో సర్వీసులను నడుపుతున్న కార్గో ఏజెంట్స్ ఛార్జీలను పెంచారు. మస్కట్ మరియు న్యూ ఢిల్లీ మధ్య ఒక కిలో కార్గోకి 100 బైసాస్ నుండి 1.3 ఒమన్ రియాల్స్కి ఛారీజని పెంచారు. మస్కట్లో సమావేశమైన 35 మంది ఏజెంట్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్ వరకు మాత్రమే కార్గోను అనుమతిస్తారు. అక్కడినుంచి కార్గో ఏజెంట్స్ దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిస్తారు. మస్కట్ ఎయిర్పోర్ట్ వద్ద కార్గో హ్యాండ్లింగ్ ఛార్జీలు ఉంటాయనీ, అలాగే ఇతర ఛార్జీలు కూడా అదనంగా వసూలు చేయబడ్తాయని కార్గో ఏజెంట్లు స్పష్టం చేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు స్థానికంగా ఛార్జీలు పెరగడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఏజెంట్లు సమావేశం తర్వాత వివరించారు. ప్రమాదకర గూడ్స్ డోర్ టు డోర్ కార్గో గిఫ్ట్ పార్సెల్స్ ద్వారా అనుమతించరు. వినియోగదారులు అలాంటి వస్తువులేమీ తమ పార్సెల్స్లో ఉంచరాదు. మస్కట్ నుంచి బుక్ చేసుకున్న కార్గో 15 నుంచి 25 రోజుల వ్యవధిలో డెలివరీ అవుతుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







