హైదరాబాద్ లో అమజాన్ కార్యాలయానికి శంకుస్థాపన
- March 30, 2016
నగరంలో అమెజాన్ సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ను నెలకొల్పడం సంతోషకరంగా ఉందని ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు పేర్కొన్నారు. నగరంలోని వేవ్రాక్లో దేశంలోనే అతిపెద్దది, ప్రపంచంలో రెండో పెద్దదైన అమెజాన్ ఇండియా క్యాంపస్కు మంత్రి కేటీఆర్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అమెరికా తర్వాత హైదరాబాద్లోనే అమెజాన్ పెద్ద క్యాంపస్ నిర్మిస్తోందని తెలిపారు. అమెజాన్ క్యాంపస్ 2019 వరకు పూర్తవుతుందని తెలిపారు. స్థానిక ఉత్పత్తులను అమెజాన్ విక్రయిస్తుందన్నారు. పెట్టుబడులకు అనుకూలంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. దేశంలో అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్ను నెలకొల్పామని గుర్తు చేశారు. ఏప్రిల్ 4న సీఎం కేసీఆర్ ఐటీ పాలసీని ప్రకటిస్తారని చెప్పారు. నాలుగు సపరేట్ పాలసీలతో పాటు ఐటీ పాలసీని ఆవిష్కరిస్తామన్నారు. పలు పరిశ్రమల దిగ్గజాల సమక్షంలో ఐటీ పాలసీని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ఇన్ఫోసిస్ వ్యవస్థాపక సభ్యుడైన నారాయణ మూర్తి కూడా హాజరవుతారని చెప్పారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









