హైదరాబాద్ లో అమజాన్ కార్యాలయానికి శంకుస్థాపన
- March 30, 2016
నగరంలో అమెజాన్ సెకండ్ లార్జెస్ట్ క్యాంపస్ను నెలకొల్పడం సంతోషకరంగా ఉందని ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు పేర్కొన్నారు. నగరంలోని వేవ్రాక్లో దేశంలోనే అతిపెద్దది, ప్రపంచంలో రెండో పెద్దదైన అమెజాన్ ఇండియా క్యాంపస్కు మంత్రి కేటీఆర్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అమెరికా తర్వాత హైదరాబాద్లోనే అమెజాన్ పెద్ద క్యాంపస్ నిర్మిస్తోందని తెలిపారు. అమెజాన్ క్యాంపస్ 2019 వరకు పూర్తవుతుందని తెలిపారు. స్థానిక ఉత్పత్తులను అమెజాన్ విక్రయిస్తుందన్నారు. పెట్టుబడులకు అనుకూలంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. దేశంలో అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్ను నెలకొల్పామని గుర్తు చేశారు. ఏప్రిల్ 4న సీఎం కేసీఆర్ ఐటీ పాలసీని ప్రకటిస్తారని చెప్పారు. నాలుగు సపరేట్ పాలసీలతో పాటు ఐటీ పాలసీని ఆవిష్కరిస్తామన్నారు. పలు పరిశ్రమల దిగ్గజాల సమక్షంలో ఐటీ పాలసీని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ఇన్ఫోసిస్ వ్యవస్థాపక సభ్యుడైన నారాయణ మూర్తి కూడా హాజరవుతారని చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







