బీజేపీ తరఫున ప్రచారం చేయనున్న సూపర్స్టార్
- March 30, 2016
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున సూపర్స్టార్ రజనీకాంత్ ప్రచారం చేసేందుకు అంగీకరించినట్లు ఆ పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. మూడు ప్రధాన వేదికల నుంచి ప్రసంగించేలా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధరరావు రజనీని ఒప్పించారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే వివిధ పీఠాధిపతులు, స్వాములు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు ఆ పార్టీ తెలిపింది. గడిచిన పార్లమెంటు ఎన్నికల సమయంలో రజనీకి పార్టీ తీర్థం ఇప్పించాలని బీజేపీ ఎన్నో ప్రయత్నాలు చేసింది.ఎన్నికల ప్రచారాల్లో భాగంగా నరేంద్రమోదీ చెన్నైకి వచ్చినపుడు రజనీకాంత్ ఇంటికి వెళ్లి కలిశారు.
అయితే ఇది కేవలం స్నేహపూర్వక కలయికని మోదీ సమక్షంలోనే రజనీకాంత్ స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికలకు రజనీకాంత్ ప్రచారం కూడా చేయలేదు. అసెంబ్లీ ఎన్నికల్లోనైనా రజనీకాంత్ క్రేజ్ను ఓట్లుగా మలచుకోవాలని కమలనాథులు మరో ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. బీజేపీకి ప్రచారంపై ఇప్పటివరకు రజనీకాంత్ నుంచి స్పందన లేదా ఖండన వెలువడలేదు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









