'స్మార్ట్‌' పాస్‌పోర్టులు....

- March 30, 2016 , by Maagulf
'స్మార్ట్‌' పాస్‌పోర్టులు....

స్మార్ట్‌ఫోన్‌లోని సమాచారాన్నే పాస్‌పోర్టుగా ఉపయోగించుకుంటూ ప్రయాణాలకు అనుమతించే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించడంపై బ్రిటన్‌ సంస్థ 'డి లా ర్యూ' దృష్టిపెట్టింది. పాస్‌పోర్టుల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థగా 'డి లా ర్యూ' ప్రసిద్ధి చెందింది. పాస్‌పోర్టు సమాచారాన్ని సురక్షితంగా స్మార్ట్‌ఫోన్‌ ద్వారా డిజిటల్‌ రూపంలో వినియోగించడంపై ప్రత్యేక ప్రాజెక్టును ప్రారంభించినట్లు సంస్థ వెల్లడించింది. ఈ ప్రాజెక్టు ప్రస్తుతం ప్రాథమిక దశలోనే ఉందని తెలిపింది. తాజా సాంకేతికత అందుబాటులోకి వస్తే ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు పాస్‌పోర్టులకు కాలం చెల్లినట్లే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com