కువైట్ లోని భారతీయులకు మరింత మెరుగైన సేవలు!
- February 28, 2022
కువైట్ సిటీ: కువైట్ లోని భారతీయులకు మరోమూడు పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి.కువైట్ సిటీ, ఫహాహీల్, అబ్బాసియా ప్రాంతాల్లో ఈ సెంటర్లు ఏర్పాటయ్యాయి.బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సహకారంతో భారత రాయబార కార్యాలయం నెలకొల్పిన ఈ సెంటర్లను తాజాగా కువైట్ లోని భారత రాయబారి సిబి జార్జి ప్రారంభించారు.ఈ మూడు సెంటర్ల ద్వారా ఏటా సుమారు రెండు లక్షల అప్లికేషన్లను ప్రాసెస్ చేయవచ్చని ఈ సందర్భంగా ఆయన అంచనా వేశారు.కువైట్ లోని భారతీయులకు మెరుగైన సౌకర్యాలను కల్పించే ఉద్దేశంతో ఈ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.ఈ కేంద్రాలు దరఖాస్తుదారుల సౌలభ్యం కోసం ఫోటోకాపీ చేయడం, డాక్యుమెంట్ ప్రింటింగ్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫోటోగ్రఫీ, కొరియర్ డెలివరీ, ఫారమ్ ఫిల్లింగ్ మరియు ఇంగ్లీష్/అరబిక్ టైపింగ్ వంటి అదనపు సేవలను అందిస్తాయి.ఈ సౌకర్యాల కారణంగా మొత్తం అప్లికేషన్ ప్రాసెసింగ్ సమయం క్రమబద్ధీకరించబడింది మరియు తగ్గించబడింది.దరఖాస్తుదారులు ఈ కేంద్రాలలో వాణిజ్య, వ్యక్తిగత మరియు విద్యా పత్రాల ధృవీకరణను కూడా పొందవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- జాయింట్ భద్రతా ప్రాజెక్టుల్లో డేటా రక్షణకు యూఏఈ–ఖతర్ అవగాహన ఒప్పందం
- వాట్సాప్లో అద్భుతమైన ఫీచర్..
- చికాగోలో NATS అడాప్ట్ ఎ హైవే కు మంచి స్పందన
- షార్జా యూనివర్సిటీ ఆసుపత్రి విస్తరణకు AED 300 మిలియన్ల మంజూరు
- ‘దుబాయ్-ఇట్’ వ్యూహాన్ని ఆవిష్కరించిన షేక్ మొహమ్మద్
- కృష్ణలంక ఘటన పై ఏపీ ప్రభుత్వం సీరియస్..
- NEET పరీక్ష సమయంలో టెలిగ్రామ్ నిషేధం..రాహుల్ గాంధీ ఆగ్రహం
- హైదరాబాద్లో టెస్లా ఎక్స్పీరియన్స్ సెంటర్
- ఇరాన్ విషయంలో మరో బాంబ్ పేల్చిన ట్రంప్
- మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించిన అధికారులు









