కువైట్ లోని భారతీయులకు మరింత మెరుగైన సేవలు!
- February 28, 2022
కువైట్ సిటీ: కువైట్ లోని భారతీయులకు మరోమూడు పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి.కువైట్ సిటీ, ఫహాహీల్, అబ్బాసియా ప్రాంతాల్లో ఈ సెంటర్లు ఏర్పాటయ్యాయి.బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సహకారంతో భారత రాయబార కార్యాలయం నెలకొల్పిన ఈ సెంటర్లను తాజాగా కువైట్ లోని భారత రాయబారి సిబి జార్జి ప్రారంభించారు.ఈ మూడు సెంటర్ల ద్వారా ఏటా సుమారు రెండు లక్షల అప్లికేషన్లను ప్రాసెస్ చేయవచ్చని ఈ సందర్భంగా ఆయన అంచనా వేశారు.కువైట్ లోని భారతీయులకు మెరుగైన సౌకర్యాలను కల్పించే ఉద్దేశంతో ఈ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.ఈ కేంద్రాలు దరఖాస్తుదారుల సౌలభ్యం కోసం ఫోటోకాపీ చేయడం, డాక్యుమెంట్ ప్రింటింగ్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫోటోగ్రఫీ, కొరియర్ డెలివరీ, ఫారమ్ ఫిల్లింగ్ మరియు ఇంగ్లీష్/అరబిక్ టైపింగ్ వంటి అదనపు సేవలను అందిస్తాయి.ఈ సౌకర్యాల కారణంగా మొత్తం అప్లికేషన్ ప్రాసెసింగ్ సమయం క్రమబద్ధీకరించబడింది మరియు తగ్గించబడింది.దరఖాస్తుదారులు ఈ కేంద్రాలలో వాణిజ్య, వ్యక్తిగత మరియు విద్యా పత్రాల ధృవీకరణను కూడా పొందవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- రంజాన్ సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు
- తిరుపతి నుండి గల్ఫ్ దేశాలకు విమాన సర్వీసులు నడపాలి: ఎంపీ రఘునాధరెడ్డి
- US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు
- మహిళలకు APSRTC శుభవార్త..
- ఆటో రంగంలో భారత్కు బిగ్ బూస్ట్, చైనాకు షాక్
- మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో..సైబరాబాద్ సీపీ దిశానిర్దేశం
- లోక్ భవన్లో గవర్నర్ను కలిసిన అసెంబ్లీ స్పీకర్
- మీడియా సిటీ ఖతార్.. 244 సంస్థలు ఆసక్తి..!!
- 46వ అల్బరాకా ఫోరమ్ ప్రారంభించిన మదీనా అమీర్..!!
- యూఏఈ మొట్టమొదటి రోడ్-రైల్ అంబులెన్స్..!!









