కువైట్ లోని భారతీయులకు మరింత మెరుగైన సేవలు!
- February 28, 2022
కువైట్ సిటీ: కువైట్ లోని భారతీయులకు మరోమూడు పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సెంటర్లు అందుబాటులోకి వచ్చాయి.కువైట్ సిటీ, ఫహాహీల్, అబ్బాసియా ప్రాంతాల్లో ఈ సెంటర్లు ఏర్పాటయ్యాయి.బీఎల్ఎస్ ఇంటర్నేషనల్ సహకారంతో భారత రాయబార కార్యాలయం నెలకొల్పిన ఈ సెంటర్లను తాజాగా కువైట్ లోని భారత రాయబారి సిబి జార్జి ప్రారంభించారు.ఈ మూడు సెంటర్ల ద్వారా ఏటా సుమారు రెండు లక్షల అప్లికేషన్లను ప్రాసెస్ చేయవచ్చని ఈ సందర్భంగా ఆయన అంచనా వేశారు.కువైట్ లోని భారతీయులకు మెరుగైన సౌకర్యాలను కల్పించే ఉద్దేశంతో ఈ సెంటర్లు ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.ఈ కేంద్రాలు దరఖాస్తుదారుల సౌలభ్యం కోసం ఫోటోకాపీ చేయడం, డాక్యుమెంట్ ప్రింటింగ్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫోటోగ్రఫీ, కొరియర్ డెలివరీ, ఫారమ్ ఫిల్లింగ్ మరియు ఇంగ్లీష్/అరబిక్ టైపింగ్ వంటి అదనపు సేవలను అందిస్తాయి.ఈ సౌకర్యాల కారణంగా మొత్తం అప్లికేషన్ ప్రాసెసింగ్ సమయం క్రమబద్ధీకరించబడింది మరియు తగ్గించబడింది.దరఖాస్తుదారులు ఈ కేంద్రాలలో వాణిజ్య, వ్యక్తిగత మరియు విద్యా పత్రాల ధృవీకరణను కూడా పొందవచ్చు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







