కతార్ స్టేడియం నిర్మాణంలో వెట్టిచాకిరీ
- March 31, 2016
ఫిఫా 2022లో నిర్వహించే ప్రపంచకప్ కోసం సిద్ధమవుతున్న ప్రధాన స్టేడియం పనుల్లో ఉద్యోగుల చేత వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ప్రముఖ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నెషనల్ ఆరోపించింది. ఇక్కడ పనిచేసే వారికి అత్యంత నాసిరకపు వసతి కల్పిస్తూ వాటిల్లోనే ఉండాలని బలవంతం చేస్తున్నారని.. వారి వద్ద నుంచి భారీగా రిక్రూట్మెంట్ ఫీజ్ వసూలు చేశారని.. దీంతోపాటు వేతనాలను నిలిపివేసి.. పాస్పోర్టులను స్వాధీనం చేసుకొని పని చేయిస్తున్నారని ఆరోపించింది. ఫిఫా ఈ వ్యవహారాన్ని పసిగట్టడంలో పూర్తిగా విఫలమైందని కూడా తన నివేదికలో అమ్నెస్టీ ఆరోపించింది.
మానవహక్కుల ఉల్లంఘనలతో నిర్మించే ప్రాంగణాల్లో టోర్ని నిర్వహించవద్దని అమ్నెస్టీ కోరింది. దీనిపై కతార్ ప్రభుత్వం స్పందిస్తూ ఈ ఆరోపణలపై విచారణ నిర్వహిస్తామని పేర్కొంది. వలస కూలీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. దీనిపై ఫిఫా గవర్నెంగ్ బాడీ కూడా స్పందించి కొన్ని కొలమానాలను ఇప్పటికే నిర్దేశించామని.. ప్రస్తుతం వలస కార్మికుల జీవన పరిస్థితి మెరుగుపడిందని పేర్కొంది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







