కతార్ స్టేడియం నిర్మాణంలో వెట్టిచాకిరీ
- March 31, 2016
ఫిఫా 2022లో నిర్వహించే ప్రపంచకప్ కోసం సిద్ధమవుతున్న ప్రధాన స్టేడియం పనుల్లో ఉద్యోగుల చేత వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ప్రముఖ మానవ హక్కుల సంస్థ అమ్నెస్టీ ఇంటర్నెషనల్ ఆరోపించింది. ఇక్కడ పనిచేసే వారికి అత్యంత నాసిరకపు వసతి కల్పిస్తూ వాటిల్లోనే ఉండాలని బలవంతం చేస్తున్నారని.. వారి వద్ద నుంచి భారీగా రిక్రూట్మెంట్ ఫీజ్ వసూలు చేశారని.. దీంతోపాటు వేతనాలను నిలిపివేసి.. పాస్పోర్టులను స్వాధీనం చేసుకొని పని చేయిస్తున్నారని ఆరోపించింది. ఫిఫా ఈ వ్యవహారాన్ని పసిగట్టడంలో పూర్తిగా విఫలమైందని కూడా తన నివేదికలో అమ్నెస్టీ ఆరోపించింది.
మానవహక్కుల ఉల్లంఘనలతో నిర్మించే ప్రాంగణాల్లో టోర్ని నిర్వహించవద్దని అమ్నెస్టీ కోరింది. దీనిపై కతార్ ప్రభుత్వం స్పందిస్తూ ఈ ఆరోపణలపై విచారణ నిర్వహిస్తామని పేర్కొంది. వలస కూలీల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. దీనిపై ఫిఫా గవర్నెంగ్ బాడీ కూడా స్పందించి కొన్ని కొలమానాలను ఇప్పటికే నిర్దేశించామని.. ప్రస్తుతం వలస కార్మికుల జీవన పరిస్థితి మెరుగుపడిందని పేర్కొంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









