పనిమనిషిని వేధించిన యజమానికి 15 ఏళ్ల జైలు
- March 12, 2022
దుబాయ్: విదేశీ పౌరసత్వం ఉన్న అరబ్ మేనేజర్పై కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ జారీ చేసిన జీవిత ఖైదును 15 సంవత్సరాల జైలుశిక్షగా దుబాయ్ అప్పీలేట్ కోర్ట్ మార్చింది. జైలు శిక్ష అనుభవించిన తర్వాత అతనిని దేశం నుంచి బహిష్కరించాలన్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. నిందితుడు తన వద్ద పనిచేసిన ఒక ఆసియా పనిమనిషిని నిర్బంధించి, చనిపోయే వరకు ఆమెపై దాడి చేసినట్లు అభియోగాలు మోపారు. ఈ కేసు సెప్టెంబర్ 2020 లో జరిగింది. తీవ్ర గాయాలతో ఉన్న ఆసియా మహిళను దుబాయ్లోని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుదూ సదరు మహిళ మరణించింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. తీవ్ర గాయాలతోనే సదరు మహిళ మరణించిందని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసింది. పోలీసుల విచారణలో నిందితుడి తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతనికి 15 సంవత్సరాల జైలు శిక్షను దుబాయ్ కోర్టు విధించింది.
తాజా వార్తలు
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం
- థియేటర్లలో తినుబండారాల ధరలు పై సుప్రీంకోర్టు ఆందోళన
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!







