పనిమనిషిని వేధించిన యజమానికి 15 ఏళ్ల జైలు
- March 12, 2022
దుబాయ్: విదేశీ పౌరసత్వం ఉన్న అరబ్ మేనేజర్పై కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ జారీ చేసిన జీవిత ఖైదును 15 సంవత్సరాల జైలుశిక్షగా దుబాయ్ అప్పీలేట్ కోర్ట్ మార్చింది. జైలు శిక్ష అనుభవించిన తర్వాత అతనిని దేశం నుంచి బహిష్కరించాలన్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. నిందితుడు తన వద్ద పనిచేసిన ఒక ఆసియా పనిమనిషిని నిర్బంధించి, చనిపోయే వరకు ఆమెపై దాడి చేసినట్లు అభియోగాలు మోపారు. ఈ కేసు సెప్టెంబర్ 2020 లో జరిగింది. తీవ్ర గాయాలతో ఉన్న ఆసియా మహిళను దుబాయ్లోని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుదూ సదరు మహిళ మరణించింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. తీవ్ర గాయాలతోనే సదరు మహిళ మరణించిందని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసింది. పోలీసుల విచారణలో నిందితుడి తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతనికి 15 సంవత్సరాల జైలు శిక్షను దుబాయ్ కోర్టు విధించింది.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







