పనిమనిషిని వేధించిన యజమానికి 15 ఏళ్ల జైలు
- March 12, 2022
దుబాయ్: విదేశీ పౌరసత్వం ఉన్న అరబ్ మేనేజర్పై కోర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇన్స్టాన్స్ జారీ చేసిన జీవిత ఖైదును 15 సంవత్సరాల జైలుశిక్షగా దుబాయ్ అప్పీలేట్ కోర్ట్ మార్చింది. జైలు శిక్ష అనుభవించిన తర్వాత అతనిని దేశం నుంచి బహిష్కరించాలన్న నిర్ణయాన్ని కోర్టు సమర్థించింది. నిందితుడు తన వద్ద పనిచేసిన ఒక ఆసియా పనిమనిషిని నిర్బంధించి, చనిపోయే వరకు ఆమెపై దాడి చేసినట్లు అభియోగాలు మోపారు. ఈ కేసు సెప్టెంబర్ 2020 లో జరిగింది. తీవ్ర గాయాలతో ఉన్న ఆసియా మహిళను దుబాయ్లోని ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుదూ సదరు మహిళ మరణించింది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. తీవ్ర గాయాలతోనే సదరు మహిళ మరణించిందని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసింది. పోలీసుల విచారణలో నిందితుడి తన నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతనికి 15 సంవత్సరాల జైలు శిక్షను దుబాయ్ కోర్టు విధించింది.
తాజా వార్తలు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్









