ఢిల్లీ గోకుల్పురిలో ఘోర అగ్నిప్రమాదం..
- March 12, 2022
న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని గోకుల్ పురి ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.గుడిసెలు ఉన్న ప్రాంతంలో.. అర్థరాత్రి మంటలు అంటుకున్నాయి.ఘటనలో.. 30 గుడిసెలు పూర్తిగా తగలబడిపోయాయి.ఏడుగురు సజీవ దహనమైనట్టు తెలుస్తోంది.మరింత మంది తీవ్ర గాయాలపాలైనట్టు సమాచారం అందుతోంది.
అర్థరాత్రి అంటుకున్న మంటలపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. తెల్లవారేసరికి మంటలు అదుపులోకి తెచ్చారు. ఘటన ఎలా జరిగిందన్నదానిపై.. ఢిల్లీ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
గోకుల్ పురి ఘటనలో గాయపడిన వారిని అధికారులు ఆస్పత్రికి తరలించారు. మంటల్లో తీవ్ర గాయాలపాలైన కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన.. ప్రమాదవశాత్తూ జరిగిందా.. వెనక ఎవరైనా ఉన్నారా.. అన్నది తేలాల్సి ఉంది.
ఉన్నట్టుండి హఠాత్తుగా అంటుకున్న మంటలు.. గోకుల్ పురి గుడిసె వాసుల్లో భయాందోళనలు కలిగించాయి. అర్థరాత్రి జరిగిన ఈ సంఘటనతో.. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు.చూస్తుండగానే అంటుకున్న మంటలు.. ఏడుగురిని సజీవ దహనం చేయడంతో.. బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.ఈ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలను సీఎం కేజ్రీవాల్ పరామర్శించారు.
తాజా వార్తలు
- జూలై 5 నుంచి విదేశాంగ మంత్రి జైశంకర్ విదేశీ పర్యటన..
- కల్తీ ఆహారం పై కఠిన చర్యలు..అధికారులకు సీఎస్ సంజయ్ జాజు ఆదేశం
- ఎతిహాద్ రైల్తో ఫుజైరా పర్యాటక రంగానికి ఊతం..
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి







