ఢిల్లీ గోకుల్పురిలో ఘోర అగ్నిప్రమాదం..
- March 12, 2022
న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని గోకుల్ పురి ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది.గుడిసెలు ఉన్న ప్రాంతంలో.. అర్థరాత్రి మంటలు అంటుకున్నాయి.ఘటనలో.. 30 గుడిసెలు పూర్తిగా తగలబడిపోయాయి.ఏడుగురు సజీవ దహనమైనట్టు తెలుస్తోంది.మరింత మంది తీవ్ర గాయాలపాలైనట్టు సమాచారం అందుతోంది.
అర్థరాత్రి అంటుకున్న మంటలపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. తెల్లవారేసరికి మంటలు అదుపులోకి తెచ్చారు. ఘటన ఎలా జరిగిందన్నదానిపై.. ఢిల్లీ ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
గోకుల్ పురి ఘటనలో గాయపడిన వారిని అధికారులు ఆస్పత్రికి తరలించారు. మంటల్లో తీవ్ర గాయాలపాలైన కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఈ ఘటన.. ప్రమాదవశాత్తూ జరిగిందా.. వెనక ఎవరైనా ఉన్నారా.. అన్నది తేలాల్సి ఉంది.
ఉన్నట్టుండి హఠాత్తుగా అంటుకున్న మంటలు.. గోకుల్ పురి గుడిసె వాసుల్లో భయాందోళనలు కలిగించాయి. అర్థరాత్రి జరిగిన ఈ సంఘటనతో.. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ప్రజలు తీవ్ర ఆందోళన చెందారు.చూస్తుండగానే అంటుకున్న మంటలు.. ఏడుగురిని సజీవ దహనం చేయడంతో.. బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు.ఈ అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబాలను సీఎం కేజ్రీవాల్ పరామర్శించారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







