సిమ్లా మిర్చి గ్రేవీ
- June 10, 2015
కావలసిన పదార్ధాలు:
- కాప్సికమ్ - 3 (పెద్దవి)
- పల్లీలు - 1/4 కప్పు
- తెల్ల నువ్వులు - 2 టేబుల్ స్పూన్లు
- జీలకర్ర - 2 టీ స్పూన్లు
- చింతపండు - నిమ్మకాయంత
- ఉప్పు - సరిపడా
- పసుపు - 1 టీ స్పూను
- కారం - 1 టీ స్పూను
- ధనియాల పొడి - 1 టీ స్పూను
- జీలకర్ర పొడి - 1 టీ స్పూను
గ్రేవీ కోసం:
- ఉల్లిపాయ - 1
- టొమాటోలు - 3
- అల్లం - అంగుళం ముక్క
- వెల్లుల్లి - 4 రెబ్బలు
- కొబ్బరి - 2 టేబుల్ స్పూన్లు
తాలింపు కోసం:
- ఆవాలు - 1 టీ స్పూను
- మెంతులు - 1/2 టీ స్పూను
- ఉల్లి గింజలు - 1 టీ స్పూను
- నూనె - 1 టేబుల్ స్పూను
చేయు విధానం:
- చింతపండుని గోరువెచ్చని నీళ్ళల్లో పావుగంట నానబెట్టి గుజ్జులా చేయాలి.
- బాణీలో పల్లీలు, నువ్వులు, జీలకర్ర వేయించి పొడి చేయాలి.
- తర్వాతా గ్రేవీ కోసం తీసుకున్నవన్నీ నీళ్ళు లేకుండా మెత్తగా రుబ్బాలి.
- బాణీలో టీ స్పూను నూనె వేసి కాప్సికమ్ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి నాలుగైదు నిమిషాలు వేయించి పక్కన పెట్టండి.
- మరో బాణీలో నూనె వేసి తాలింపు చేసి, రుబ్బిన మసాలా ముద్ద వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.
- గ్రేవీ చిక్కబడ్డాక పల్లీల పొడి, ఉప్పు, కారం, పసుపు, జీలకర్రపొడి, ధనియాలపొడి, చింతపండు గుజ్జు వేసి కలిపి అయిదు నిమిషాలు ఉడికించాలి.
- ఇప్పుడు వేయించిన కాప్సికమ్ ముక్కలు వేసి చిక్కబడేవరకూ ఉడికించి దించాలి.
----ఏ. రమణి, గుంటూర్.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









