చిన్న కంపెనీలకు కూడా పీ.ఎఫ్. అమలు చేయనున్న బండారు దత్తాత్రేయ

- April 02, 2016 , by Maagulf
చిన్న కంపెనీలకు కూడా పీ.ఎఫ్. అమలు చేయనున్న బండారు దత్తాత్రేయ

కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయను బీడీ కార్మికులు కలిశారు. బీడీకట్టలపై పుర్రెగుర్తు తొలగించాలని దత్తాత్రేయకు బీడీ కార్మికులు విజ్ఞప్తి చేశారు. బీడీ కార్మికుల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. 10 మంది పనిచేసే ఆఫీస్‌ల్లోనూ పీఎఫ్‌ అమలు చేస్తామని కేంద్ర మంత్రి దత్తాత్రేయ వారికి హామీ ఇచ్చారు. బీడీ కార్మికులకు న్యాయం చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తామని ఆయన తెలిపారు. కార్మికులకు బోనస్‌ రూ. 3,500 నుంచి రూ.7 వేలకు పెంచామని దత్తాత్రేయ ప్రకటించారు. దేశ వ్యాప్తంగా లక్ష ఐటీఐ కాలేజీలను ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. విద్యార్థులకు స్కిల్‌డెవలప్‌మెంట్‌ శిక్షణ కూడా ఇప్పిస్తామని దత్తాత్రేయ తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com