15 ఏళ్లపాటు ఇన్వెస్టర్ రెసిడెన్సీకి ఆమోదం
- March 24, 2022
కువైట్: విదేశీయులకు రెసిడెన్సీ ప్రాజెక్ట్ విషయంపై పార్లమెంటరీ ఇంటీరియర్, డిఫెన్స్ కమిటీ సభ్యులు.. మంత్రి నేతృత్వంలోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు సమీక్ష నిర్వహించారు. ఇన్వెస్టర్లకు 15 సంవత్సరాల రెసిడెన్సీని మంజూరు చేయడానికి అంగీకరించారు. అలాగే కువైట్లను వివాహం చేసుకున్న మహిళలకు కువైట్ పౌరసత్వంపై వారు చర్చించారు. వివాహం అయిన 18 సంవత్సరాల తర్వాత ఆమెకు పిల్లలు లేకపోయినా, కువైట్ మహిళ కింద పరిగణించే ప్రతిపాదనకు వారు ఆమోదం తెలిపారు. దీని ప్రకారం.. ఆమెకు సరైన ఉపాధి, అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వబడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒకటికంటే ఎక్కువ భార్యలు ఉన్న సందర్భంలోనూ ఇదే నిబంధన వర్తించనుంది. అదే సమయంలో కువైటీలను పెళ్లి చేసుకున్న గల్ఫ్ మహిళలకు పౌరసత్వం మంజూరు చేసే కాలాన్ని తగ్గించాలని, ఇతర దేశాల నుండి వారిని వేరుగా చూడాలని పార్లమెంటరీ అంతర్గత, రక్షణ కమిటీ సిఫార్సు చేసింది.
తాజా వార్తలు
- ఖతార్, ఒమన్ మధ్య బలపడుతున్న స్నేహబంధం..
- మలేషియా ఎయిర్లైన్స్ విమానానికి తప్పిన ప్రమాదం
- ‘దుబాయ్-ఇట్ అవార్డు’కు ఆగస్టు 10 నుంచి నామినేషన్లు
- బ్రహ్మోస్కు భారీ డిమాండ్..
- వరంగల్లో పోలీసు అమరవీరుల కుటుంబాలతో డీజీపీ సీవీ ఆనంద్ భేటీ
- పిల్లల స్క్రీన్ టైమ్పై జాగ్రత్త.. నిద్ర, ఆరోగ్యంపై ప్రభావం..!!
- సౌదీపై హౌతీ దాడులను ఖండించిన యూఎన్ఎస్సీ.. బహ్రెయిన్ స్వాగతం..!!
- దుబాయ్లో నాన్ ముస్లిం ప్రవాసుల వివాహం.. అర్హతలు, ప్రక్రియ..!!
- ఒమన్లో పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- సౌదీలో భారీ వర్షాలు, వడగళ్లకు అవకాశం.. 47 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







