15 ఏళ్లపాటు ఇన్వెస్టర్ రెసిడెన్సీకి ఆమోదం
- March 24, 2022
కువైట్: విదేశీయులకు రెసిడెన్సీ ప్రాజెక్ట్ విషయంపై పార్లమెంటరీ ఇంటీరియర్, డిఫెన్స్ కమిటీ సభ్యులు.. మంత్రి నేతృత్వంలోని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు సమీక్ష నిర్వహించారు. ఇన్వెస్టర్లకు 15 సంవత్సరాల రెసిడెన్సీని మంజూరు చేయడానికి అంగీకరించారు. అలాగే కువైట్లను వివాహం చేసుకున్న మహిళలకు కువైట్ పౌరసత్వంపై వారు చర్చించారు. వివాహం అయిన 18 సంవత్సరాల తర్వాత ఆమెకు పిల్లలు లేకపోయినా, కువైట్ మహిళ కింద పరిగణించే ప్రతిపాదనకు వారు ఆమోదం తెలిపారు. దీని ప్రకారం.. ఆమెకు సరైన ఉపాధి, అర్హులైన వారికి ఉద్యోగం ఇవ్వబడుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒకటికంటే ఎక్కువ భార్యలు ఉన్న సందర్భంలోనూ ఇదే నిబంధన వర్తించనుంది. అదే సమయంలో కువైటీలను పెళ్లి చేసుకున్న గల్ఫ్ మహిళలకు పౌరసత్వం మంజూరు చేసే కాలాన్ని తగ్గించాలని, ఇతర దేశాల నుండి వారిని వేరుగా చూడాలని పార్లమెంటరీ అంతర్గత, రక్షణ కమిటీ సిఫార్సు చేసింది.
తాజా వార్తలు
- డాలస్ లో మహాత్మాగాంధీ మెమోరియల్ వద్ద ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
- ప్రారంభమైన టెలిగ్రామ్ సేవలు
- ఇరాన్ ఆయిల్ పై ఆంక్షలు ఎత్తేసిన అమెరికా
- భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో యోగా సమ్మేళనం..!!
- అర్హతలు,వృత్తుల సవరణకు కార్మికులకు కువైట్ అనుమతి..!!
- 2023 తర్వాత ఒమన్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు..!!
- గౌహతి నుండి దుబాయ్, అబుదాబికి డైరెక్ట్ ఫ్లైట్స్..!!
- పబ్లిక్ పార్కులలో 12 వాణిజ్య కార్యకలాపాలకు సౌదీ అనుమతి..!!
- ఖతార్ లో లుసైల్ ట్రామ్ సేవలు నిలిపివేత..!!
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..







