ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు శుభవార్త...
- March 26, 2022
తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే నడుస్తున్న సైనిక్ స్కూళ్లకు అదనంగా మరో 21 సైనిక్ స్కూళ్ల ఏర్పాటుకు కేంద్ర రక్షణ శాఖ శనివారం ఆమోదం తెలిపింది. పీపీపీ పద్ధతిలో నడిచే ఈ కొత్త సైనిక్ స్కూళ్లలో 7 డే స్కూళ్లుగా పనిచేయనుండగా.. 14 మాత్రం రెసిడెన్షియల్ మోడ్లో నడవనున్నట్లు రక్షణ శాఖ ప్రకటన చేసింది.
ఇక కొత్తగా ఏర్పాటు కానున్న 21 సైనిక్ స్కూళ్లలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఒక్కోటి చొప్పున సైనిక్ స్కూళ్లు మంజూరయ్యాయి. ఏపీలోని కడప జిల్లాకు చెందిన పూజ ఇంటర్నేషనల్ స్కూల్ సైనిక్ స్కూల్గా మారనుంది. ఇక తెలంగాణలో కరీంనగర్కు చెందిన సోషల్ వెల్ఫేర్ స్కూల్ను సైనిక్ స్కూల్గా సేవలు అందించనుంది. కాగా దేశవ్యాప్తంగా సైనిక్ స్కూళ్లలో ప్రవేశాలకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ అదనంగా సైనిక్ స్కూళ్లను మంజూరు చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- లండన్లో సీఎం చంద్రబాబు–యూకే హైకమిషనర్తో భేటీ
- హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్ రీస్టార్ట్..
- కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన..
- భారత్ DMF డిజిటల్ ఐకాన్ అవార్డ్స్ 2025
- బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
- బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
- యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
- కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
- సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
- ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!







