మార్చి 27 నుంచి కొత్తగా 20 ఇండిగో విమాన సర్వీసులు..!
- March 26, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో తక్కువ ధరకే విమాన సర్వీసులను అందిస్తున్న ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ ఇండిగో మార్చి 27 (ఆదివారం) నుంచి కొత్త ఇండిగో విమానాలను ప్రవేశపెడుతోంది. వేసవి షెడ్యూల్లో భాగంగా మొత్తం 20 కొత్త విమానాలను వివిధ మార్గాల్లో నడపనుంది. 20 కొత్త విమానాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. భారత మార్కెట్లో మార్కెట్ వాటా పరంగా అతి పెద్ద విమానయాన సంస్థగా పేరొందిన ఇండిగో.. 16 ప్రత్యేక విమానాల పునఃప్రారంభించనుంది. అలాగే 20 కొత్త విమానాలతో ప్రత్యేక మార్గాల్లో సర్వీసులను ప్రారంభించనుంది. ప్రయాగ్రాజ్, లక్నో మధ్య RCS సర్వీసులను ఇండిగో ప్రారంభించనుంది.
దేశీయ విమానాయన నెట్వర్క్ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ 100 విమానాలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఇండిగో రెవిన్యూ అధికారి సంజయ్ కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. వివిధ రంగాలలో ప్రయాణ డిమాండ్కు అనుగుణంగా కొత్త మార్గాలను అన్వేషిస్తున్నామని ఇండిగో ముఖ్య వ్యూహమని సంజయ్ కుమార్ నివేదికలో తెలిపారు. పూణే-మంగళూరు, పూణే-విశాఖపట్నం, హుబ్లీ-హైదరాబాద్, జమ్ము-వారణాసి, తిరుపతి-తిరుచిరాపల్లి సహా పలు మార్గాల్లో ఇండిగో ప్రత్యేక విమానాలను ప్రారంభించనుంది. మార్చి 27, 2022 నుంచి ఈ కొత్త విమాన సర్వీసులు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. మార్చి 27న అంతర్జాతీయ గమ్యస్థానాలకు షెడ్యూల్ అయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా పునఃప్రారంభమవుతాయిని అన్నారు.
కోవిడ్ మహమ్మారి కారణంగా భారత్లో షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ విమానాలను మార్చి 23, 2020 నుంచి నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎయిర్ బబుల్ ఏర్పాట్ల కింద జూలై 2020 నుంచి భారత్ 37 దేశాల మధ్య ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నాయి. ఇండిగో జనవరి 2022 నాటికి 55.5 శాతం మార్కెట్ వాటాతో భారత్ అతిపెద్ద ప్రయాణీకుల విమానయాన సంస్థగా నిలిచింది. ఆగస్టు 2006 లో సర్వీసులను ప్రారంభించిన ఇండిగో ఎయిర్లైన్ మొత్తం 276 విమానాల సర్వీసులను అందిస్తోంది. ఇండిగో 73 దేశీయ గమ్యస్థానాలు, 24 అంతర్జాతీయ గమ్యస్థానాలతో మొత్తం 97 గమ్యస్థానాల్లో విమాన సర్వీసులను అందిస్తోంది.
తాజా వార్తలు
- రియాద్లో సాటా ఆధ్వర్యంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం–TBD సీజన్ 5 విజయవంతం
- గ్లోబల్ విలేజ్ ఆఫర్ల పేరుతో మోసాలు.. దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- నీటి పొదుపు పద్ధతులతో వరి సాగు.. దిగుబడులు పెంచుకోవచ్చు: పెద్దపల్లి కలెక్టర్
- ఏవియేషన్ రంగంలో తెలంగాణ విద్యార్థులకు కొత్త బాటలు
- ఏపీ రవాణా శాఖలో కీలక సవరణలు..
- ఐపీఎల్ 2027 మినీ వేలం ఎప్పుడంటే?
- త్రివర్ణ పతాకంతో మెరిసిన పవన్ సెహ్రావత్, మను భాకర్!
- రష్యాలో గ్రాండ్గా ప్రారంభమైన టీ10 క్రికెట్ లీగ్
- 3 ఏళ్ల బాలుడిపై దాడి.. అబుదాబిలో నానీకి జైలుశిక్ష, ఫైన్..!!
- రియాద్, అల్-ఖర్జ్లో ప్రజలకు సివిల్ డిఫెన్స్ సూచనలు..!!







