మార్చి 27 నుంచి కొత్తగా 20 ఇండిగో విమాన సర్వీసులు..!
- March 26, 2022
న్యూ ఢిల్లీ: భారత్లో తక్కువ ధరకే విమాన సర్వీసులను అందిస్తున్న ఇంటర్ గ్లోబల్ ఏవియేషన్ ఇండిగో మార్చి 27 (ఆదివారం) నుంచి కొత్త ఇండిగో విమానాలను ప్రవేశపెడుతోంది. వేసవి షెడ్యూల్లో భాగంగా మొత్తం 20 కొత్త విమానాలను వివిధ మార్గాల్లో నడపనుంది. 20 కొత్త విమానాలను అందుబాటులోకి తీసుకొస్తోంది. భారత మార్కెట్లో మార్కెట్ వాటా పరంగా అతి పెద్ద విమానయాన సంస్థగా పేరొందిన ఇండిగో.. 16 ప్రత్యేక విమానాల పునఃప్రారంభించనుంది. అలాగే 20 కొత్త విమానాలతో ప్రత్యేక మార్గాల్లో సర్వీసులను ప్రారంభించనుంది. ప్రయాగ్రాజ్, లక్నో మధ్య RCS సర్వీసులను ఇండిగో ప్రారంభించనుంది.
దేశీయ విమానాయన నెట్వర్క్ను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ 100 విమానాలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఇండిగో రెవిన్యూ అధికారి సంజయ్ కుమార్ ఒక ప్రకటనలో వెల్లడించారు. వివిధ రంగాలలో ప్రయాణ డిమాండ్కు అనుగుణంగా కొత్త మార్గాలను అన్వేషిస్తున్నామని ఇండిగో ముఖ్య వ్యూహమని సంజయ్ కుమార్ నివేదికలో తెలిపారు. పూణే-మంగళూరు, పూణే-విశాఖపట్నం, హుబ్లీ-హైదరాబాద్, జమ్ము-వారణాసి, తిరుపతి-తిరుచిరాపల్లి సహా పలు మార్గాల్లో ఇండిగో ప్రత్యేక విమానాలను ప్రారంభించనుంది. మార్చి 27, 2022 నుంచి ఈ కొత్త విమాన సర్వీసులు అమల్లోకి వస్తాయని వెల్లడించారు. మార్చి 27న అంతర్జాతీయ గమ్యస్థానాలకు షెడ్యూల్ అయిన అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా పునఃప్రారంభమవుతాయిని అన్నారు.
కోవిడ్ మహమ్మారి కారణంగా భారత్లో షెడ్యూల్ చేసిన అంతర్జాతీయ విమానాలను మార్చి 23, 2020 నుంచి నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే, ఎయిర్ బబుల్ ఏర్పాట్ల కింద జూలై 2020 నుంచి భారత్ 37 దేశాల మధ్య ప్రత్యేక అంతర్జాతీయ విమానాలు నడుస్తున్నాయి. ఇండిగో జనవరి 2022 నాటికి 55.5 శాతం మార్కెట్ వాటాతో భారత్ అతిపెద్ద ప్రయాణీకుల విమానయాన సంస్థగా నిలిచింది. ఆగస్టు 2006 లో సర్వీసులను ప్రారంభించిన ఇండిగో ఎయిర్లైన్ మొత్తం 276 విమానాల సర్వీసులను అందిస్తోంది. ఇండిగో 73 దేశీయ గమ్యస్థానాలు, 24 అంతర్జాతీయ గమ్యస్థానాలతో మొత్తం 97 గమ్యస్థానాల్లో విమాన సర్వీసులను అందిస్తోంది.
తాజా వార్తలు
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...
- భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు









