పాండిచ్చేరి-హైదరాబాద్ ఫస్ట్ డైరెక్ట్ ఫ్లైట్ లో ప్రయాణించిన టి.గవర్నర్
- March 27, 2022
హైదరాబాద్: పాండిచ్చేరి-హైదరాబాద్ మధ్య ప్రవేశపెట్టిన మొదటి డైరెక్ట్ విమానంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై ప్రయాణించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో గవర్నర్ తీసుకున్న చొరవతో పాండిచ్చేరి-హైదరాబాద్ మధ్య డైరెక్ట్ ఫ్లైట్ ప్రవేశపెట్టారు. గవర్నర్ తమిళి సై శంషాబాద్ విమానాశ్రయంలోని జనరల్ అరైవల్ పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు పుదుచ్చేరిలోని అందమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడతారని అన్నారు.
పుదుచ్చేరి ప్రజలు హైదరాబాద్ బిర్యానీని రుచి చూడటానికి ఇష్టపడతారని తెలిపారు. రోజువారీ విమాన ప్రయాణం ఈ రెండు ప్రాంతాల ప్రజల బంధాన్ని మెరుగుపరుస్తుందని గవర్నర్ విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి విమాన సర్వీసులను పునరుద్ధరించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు.
పుదుచ్చేరికి విమాన కనెక్టివిటీని పెంచేందుకు హామీ ఇచ్చినందుకు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు. పుదుచ్చేరి విమానాశ్రయంలో రన్వే విస్తరణ కోసం తమిళనాడు నుంచి భూమిని సేకరించేందుకు చర్యలు తీసుకుంటామని గవర్నర్ తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!
- బహ్రెయిన్ లో పలు దేశాలకు చెందిన 19 మంది అరెస్టు..!!
- ఖతార్ T100 కిక్ ఆఫ్ రన్ షెడ్యూల్ రిలీజ్..!!
- హెచ్-1బీ వీసా పెంపుతో తలలు పట్టుకుంటున్న టెక్ కంపెనీలు