పాండిచ్చేరి-హైదరాబాద్ ఫస్ట్ డైరెక్ట్ ఫ్లైట్ లో ప్రయాణించిన టి.గవర్నర్
- March 27, 2022
హైదరాబాద్: పాండిచ్చేరి-హైదరాబాద్ మధ్య ప్రవేశపెట్టిన మొదటి డైరెక్ట్ విమానంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సై ప్రయాణించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో గవర్నర్ తీసుకున్న చొరవతో పాండిచ్చేరి-హైదరాబాద్ మధ్య డైరెక్ట్ ఫ్లైట్ ప్రవేశపెట్టారు. గవర్నర్ తమిళి సై శంషాబాద్ విమానాశ్రయంలోని జనరల్ అరైవల్ పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు పుదుచ్చేరిలోని అందమైన పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి ఇష్టపడతారని అన్నారు.
పుదుచ్చేరి ప్రజలు హైదరాబాద్ బిర్యానీని రుచి చూడటానికి ఇష్టపడతారని తెలిపారు. రోజువారీ విమాన ప్రయాణం ఈ రెండు ప్రాంతాల ప్రజల బంధాన్ని మెరుగుపరుస్తుందని గవర్నర్ విశ్వాసం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుంచి పుదుచ్చేరికి విమాన సర్వీసులను పునరుద్ధరించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు.
పుదుచ్చేరికి విమాన కనెక్టివిటీని పెంచేందుకు హామీ ఇచ్చినందుకు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు. పుదుచ్చేరి విమానాశ్రయంలో రన్వే విస్తరణ కోసం తమిళనాడు నుంచి భూమిని సేకరించేందుకు చర్యలు తీసుకుంటామని గవర్నర్ తెలిపారు.
తాజా వార్తలు
- హెచ్-1బీ వీసా పొడిగింపుకు భారీ ఫీజు..
- కువైట్లో రేంజ్ రోవర్, డిఫెండర్, డిస్కవరీ ఎస్యూవీల రీకాల్..!!
- ఇరాన్తో కీలక చర్చలు.. ట్రంప్ చివరి హెచ్చరిక!
- మస్కట్ విమానాశ్రయంలో పార్కింగ్పై ప్రత్యేక ఆఫర్..!!
- ఖతార్లో అద్దె చట్టానికి సవరణలు.. లీజ్ రిజిస్ట్రేషన్కు QR250 ఫీజు..!!
- జహ్రాలో అక్రమ స్ట్రీట్ వెండర్స్ పై ఉక్కుపాదం..!!
- సౌదీలో ఆన్లైన్ కొనుగోళ్లలో స్థానిక రిటైలర్లదే ఆధిపత్యం..!!
- మిడ్ డే వర్క్ నిషేధాన్ని పరిశీలించిన బహ్రెయిన్ మంత్రి..!!
- దుబాయ్లోని ఫిలిప్పీన్స్ బేకర్కు బిగ్ టికెట్లో Dh20 మిలియన్ల జాక్పాట్..!!
- భారతీయులకు వీసా నిబంధనలు కఠినతరం చేసిన నాలుగు దేశాలు..







