విశాఖ ఆధునికీకరణకు రూ. 26 వేల కోట్లు విడుదల చేయనున్న కేంద్రం
- March 29, 2022
ఏపీకి కేంద్రం శుభవార్త చెప్పింది. విశాఖ రిఫైనరీ ఆధునికీకరణ వ్యయం రూ. 26 వేల కోట్లు ఇస్తున్నట్లు.. రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబు ఇచ్చారు.
హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్పీసీఎల్) ఆధ్వర్యంలోని విశాఖపట్నం రిఫైనరీ ఆధునికీకరణ వ్యయం 20,928 కోట్ల రూపాయల నుంచి నుంచి 26,264 కోట్ల రూపాయలకు సవరించినట్లు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ సోమవారం రాజ్యసభకు తెలిపారు.
వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ 20,928 కోట్ల రూపాయలతో చేపట్టే విశాఖపట్నం రిఫైనరీ ఆధునికీకరణ ప్రాజెక్ట్కు జూలై 2016లో హెచ్పీసీఎస్ ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్ పనులు 2020 జూలై నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఫిబ్రవరి 2022 నాటికి ప్రాజెక్ట్ పనులు 85 శాతం పూర్తయ్యాయని.. సవరించిన లక్ష్యం ప్రకారం ప్రాజెక్ట్ పనులు 2022-23 ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
అలాగే 2021 నుంచి జనవరి 2022 వరకు 26,785 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల (ఎంఎంఎస్సీఎం) ద్రవరూప సహజ వాయువును దిగుమతి చేసుకున్నట్లు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ వెల్లడించారు. దేశంలో గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 31,137 ఎంఎంఎస్సీఎంల ఎల్ఎన్జీ ఉత్పత్తి జరిగిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో (ఆన్షోర్లో) 2016-17 నుంచి 2020-21 వరకు 4,647 ఎంఎంఎస్సీఎంల ఎల్ఎన్జీ ఉత్పత్తి జరిగినట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో 2017-18లో 32 వేల మెట్రిక్ టన్నుల సీఎన్జీ అమ్మకాలు జరగ్గా 2020-21లో అది 13 వేల మెట్రిక్ టన్నులకు తగ్గాయని చెప్పారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







