యూఏఈలో ఏప్రిల్ 2న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం
- March 29, 2022
యూఏఈ: అజ్మన్ లోని అల్ జూర్ఫ్ ప్రాంతంలో ఉన్న ఇండియన్ అసోసియేషన్ హాల్ లో ఏప్రిల్ 2న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని నిర్వహించనున్నారు.అలాగే జ్యోతిర్విద్యా భూషణ, బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారయణ మూర్తీ చే పంచాంగ శ్రవణం ఉంటుంది.తిరమల తరహాలో స్వామి కళ్యాణాన్ని నిర్వహించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన పూజారులు ఈ క్రతువులో పాల్గొంటున్నారు. భక్తులకు ఫ్రీ ఎంట్రీ అవకాశాన్ని కల్పించారు.
షెడ్యూల్:
07.00-08.00 సుప్రభాత సేవ
08.00-10.00 పంచాంగ శ్రవణం
09.00-11.00 హోమం
11.00-14.00 కల్యాణం
11.30-14.00 ప్రసాదం
ఈవెంట్ అసాంతం కీర్తనలు, భజనలు ఆకట్టుకోనున్నాయి. మరింత సమాచారం కోసం 055 5794466/055 9943873 నెంబర్లలో సంప్రదించగలరు.
సూచనలు:
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఈవెంట్ లో కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలి. మాస్కులు, సోషల్ డిస్టెన్స్ పాటించడంతోపాటు సెక్యూరిటీ గైడ్ లైన్స్ పాటించాలి.
ముఖ్యమైన గమనిక:
రమదాన్ ప్రోటోకాల్స్ ప్రకారం.. వెన్యూలో అన్న ప్రసాదాలను తినడాన్ని అనుమతించరు. భక్తులు ప్రసాదాలను తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకలు
- మార్కాపురం బస్సు ప్రమాదం...అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష
- టిప్పర్ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు..14 మంది సజీవదహనం
- అల్ జబల్ అల్ అఖ్దర్, రుస్తాక్ విలాయత్లలో భారీ వర్షాలు..!!
- ప్రాపర్టీ మార్కెట్ పతనంపై ఫేక్ న్యూస్ ను ఖండించిన దుబాయ్..!!
- వాయిదాలలో ఫోన్ల పేరిట ఫ్రాడ్..వ్యక్తి అరెస్టు..!!
- సాహ్ల్ యాప్ లో విమానయాన, ట్రావెల్ ఏజెన్సీల పై ఫిర్యాదులు..!!
- ఖతార్ లో స్కూల్ బస్సుల భద్రత పై మార్గదర్శకాలు జారీ..!!
- విజిట్ వీసాను ఫైన్ లేకుండా పొడిగింపునకు సౌదీ అనుమతి..!!
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..









