యూఏఈలో ఏప్రిల్ 2న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం
- March 29, 2022
యూఏఈ: అజ్మన్ లోని అల్ జూర్ఫ్ ప్రాంతంలో ఉన్న ఇండియన్ అసోసియేషన్ హాల్ లో ఏప్రిల్ 2న శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని నిర్వహించనున్నారు.అలాగే జ్యోతిర్విద్యా భూషణ, బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారయణ మూర్తీ చే పంచాంగ శ్రవణం ఉంటుంది.తిరమల తరహాలో స్వామి కళ్యాణాన్ని నిర్వహించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంకు చెందిన పూజారులు ఈ క్రతువులో పాల్గొంటున్నారు. భక్తులకు ఫ్రీ ఎంట్రీ అవకాశాన్ని కల్పించారు.
షెడ్యూల్:
07.00-08.00 సుప్రభాత సేవ
08.00-10.00 పంచాంగ శ్రవణం
09.00-11.00 హోమం
11.00-14.00 కల్యాణం
11.30-14.00 ప్రసాదం
ఈవెంట్ అసాంతం కీర్తనలు, భజనలు ఆకట్టుకోనున్నాయి. మరింత సమాచారం కోసం 055 5794466/055 9943873 నెంబర్లలో సంప్రదించగలరు.
సూచనలు:
కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఈవెంట్ లో కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలి. మాస్కులు, సోషల్ డిస్టెన్స్ పాటించడంతోపాటు సెక్యూరిటీ గైడ్ లైన్స్ పాటించాలి.
ముఖ్యమైన గమనిక:
రమదాన్ ప్రోటోకాల్స్ ప్రకారం.. వెన్యూలో అన్న ప్రసాదాలను తినడాన్ని అనుమతించరు. భక్తులు ప్రసాదాలను తమ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!
- నాటోతో బహ్రెయిన్ చర్చలు..కీలక అంశాల పై సమీక్ష..!!
- ఇరాన్కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్









