ఏప్రిల్ 1 నుంచి కొత్త ప్రయాణీకుల రుసుముని వసూలు చేయనున్న ఖతార్ ఎయిర్‌పోర్ట్స్

- March 29, 2022 , by Maagulf
ఏప్రిల్ 1 నుంచి కొత్త ప్రయాణీకుల రుసుముని వసూలు చేయనున్న ఖతార్ ఎయిర్‌పోర్ట్స్

ఖతార్: ఖతార్ సివిల్ ఏవియేషన్ ఇటీవలే, ఖతార్ విమానాశ్రయాల్లో కొత్తగా సర్వీసు రుసుముల్ని విధించేలా సర్క్యులర్ జారీ చేయడం జరిగింది.అన్ని ఎయిర్ లైన్ మేనేజర్లకు ట్రావెల్ ఏజెంట్లకు ఈ సర్క్యులర్ పంపారు.ఏప్రిల్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.ఎయిర్ ఫ్రీట్ ఇన్‌ఫ్ర్రాస్ట్రక్చర్ రుజుము మరియు సెక్యూరిటీ రుసుముని వసూలు చేయబోతున్నారు. ఏప్రిల్ 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి.ఫిబ్రవరి 1 తర్వాత జారీ చేసిన టిక్కెట్లకు ఇది వర్తిస్తుంది. ఎయిర్ పోర్టు అభివృద్ధి రుసుముని ప్రయాణీకులందరికీ (నిష్క్రమణలు అలాగే ట్రాన్సిట్ ప్రయాణీకులకు గంటకు 60 ఖతారీ రియాల్స్) వర్తిస్తుంది. రెండేళ్ళ లోపు చిన్నారులకు మినహాయింపు వుంది. ఒకే విమానంలో ప్రయాణించే ట్రాన్సిట్ ప్రయాణీకులకు, విమాన సిబ్బందికీ మినహాయింపు వుంది. ఇన్ ట్రాన్సిట్ కార్గో షిప్మెంట్లు మెట్రిక్ టన్నుకి 10 ఖతారీ రియాల్స్ చెల్లించాలి. ఒకే విమానంలో ప్రయాణించే కార్గోకి మినహాయింపు ఇస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com