ఎక్స్పో 2020 చివరి రోజున 24 గంటలూ నడవనున్న దుబాయ్ మెట్రో
- March 29, 2022
యూఏఈ: ఎక్స్పో 2020 ముగింపు నేపథ్యంలో దుబాయ్ మెట్రో 24 గంటలూ నడవనుంది. సందర్శకుల సౌకర్యార్థం ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 31న అత్యధిక సంఖ్యలో సందర్శకులు వుంటారని అంచనా వేస్తున్నారు. ముగింపు కార్యక్రమాల్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్న దరిమిలా, సందర్శకులు ఎక్స్పో 2020ని వీక్షించేందుకు ముందస్తుగానే సన్నాహాలు చేసుకుంటున్నారు. కాగా, ఆయా ప్రత్యేక కార్యక్రమాలకు సంబందించి సందర్శకుల్ని పరిమితం చేయనున్న దరిమిలా, ముందు వచ్చినవారికే ముందు అవకాశం దక్కనుంది. అయితే, ఎక్స్పో ప్రాంతంలో జెయింట్ స్క్రీన్లపై వాటిని చూడవచ్చు.సాయంత్రం నాలుగు గంటలకు జెట్స్ ఆకాశంలో రంగులద్దనున్నాయి. రాత్రి 7 గంటలకు అల్ వాసల్ ప్లాజా వద్ద 400 మంది ప్రదర్శన ఇవ్వనున్నారు. 8 గంటలకు యోయో మా నిర్వహించబడుతుంది దుబాయ్ మిలినీయం యాంఫీ థియేటర్ వద్ద. 8.30 నిమిషాలకు జూబ్లీ స్టేస్ వద్ద నోరా జోన్స్ ప్రదర్శన.. ఇంకా మరిన్ని ప్రత్యేక ప్రదర్శనలు వుండనున్నాయి.
తాజా వార్తలు
- యూజర్లకు UPI ఛార్జీలు ఉండవు.. కేంద్రం మరోసారి క్లారిటీ
- డేటింగ్ యాప్లో పురుషులకు అందంతో వల...రూ.6 కోట్లు వసూళ్లు
- మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం..మూడు దేశాల జెండా రంగుల్లో మెరిసిన సౌదీ ల్యాండ్మార్క్స్
- BRICS వాణిజ్య మంత్రుల సమావేశంలో యూఏఈ..
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ ట్యాంకర్పై ఇరాన్ దాడిని జీసీసీ తీవ్రంగా ఖండించింది
- హార్ముజ్ జలసంధిలో యూఏఈ చమురు ట్యాంకర్పై క్షిపణి దాడి..బహ్రెయిన్ తీవ్ర ఖండన
- హోర్ముజ్ జలసంధిలో అడ్నాక్ నౌకపై క్షిపణి దాడి..సిబ్బంది సురక్షితం
- దుబాయ్లో 290 కి.మీ. వేగంతో బైక్ పై స్టంట్లు.. రైడర్ షాక్..!!
- సౌదీలో 911 ఎమర్జెన్సీ నంబర్కు 2.7మిలియన్ కాల్స్..!!
- క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్..ప్రపంచంలో మూడో స్థానంలో ఒమన్..!!







