ఎక్స్పో 2020 చివరి రోజున 24 గంటలూ నడవనున్న దుబాయ్ మెట్రో
- March 29, 2022
యూఏఈ: ఎక్స్పో 2020 ముగింపు నేపథ్యంలో దుబాయ్ మెట్రో 24 గంటలూ నడవనుంది. సందర్శకుల సౌకర్యార్థం ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 31న అత్యధిక సంఖ్యలో సందర్శకులు వుంటారని అంచనా వేస్తున్నారు. ముగింపు కార్యక్రమాల్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్న దరిమిలా, సందర్శకులు ఎక్స్పో 2020ని వీక్షించేందుకు ముందస్తుగానే సన్నాహాలు చేసుకుంటున్నారు. కాగా, ఆయా ప్రత్యేక కార్యక్రమాలకు సంబందించి సందర్శకుల్ని పరిమితం చేయనున్న దరిమిలా, ముందు వచ్చినవారికే ముందు అవకాశం దక్కనుంది. అయితే, ఎక్స్పో ప్రాంతంలో జెయింట్ స్క్రీన్లపై వాటిని చూడవచ్చు.సాయంత్రం నాలుగు గంటలకు జెట్స్ ఆకాశంలో రంగులద్దనున్నాయి. రాత్రి 7 గంటలకు అల్ వాసల్ ప్లాజా వద్ద 400 మంది ప్రదర్శన ఇవ్వనున్నారు. 8 గంటలకు యోయో మా నిర్వహించబడుతుంది దుబాయ్ మిలినీయం యాంఫీ థియేటర్ వద్ద. 8.30 నిమిషాలకు జూబ్లీ స్టేస్ వద్ద నోరా జోన్స్ ప్రదర్శన.. ఇంకా మరిన్ని ప్రత్యేక ప్రదర్శనలు వుండనున్నాయి.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









