ఎక్స్పో 2020 చివరి రోజున 24 గంటలూ నడవనున్న దుబాయ్ మెట్రో
- March 29, 2022
యూఏఈ: ఎక్స్పో 2020 ముగింపు నేపథ్యంలో దుబాయ్ మెట్రో 24 గంటలూ నడవనుంది. సందర్శకుల సౌకర్యార్థం ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 31న అత్యధిక సంఖ్యలో సందర్శకులు వుంటారని అంచనా వేస్తున్నారు. ముగింపు కార్యక్రమాల్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్న దరిమిలా, సందర్శకులు ఎక్స్పో 2020ని వీక్షించేందుకు ముందస్తుగానే సన్నాహాలు చేసుకుంటున్నారు. కాగా, ఆయా ప్రత్యేక కార్యక్రమాలకు సంబందించి సందర్శకుల్ని పరిమితం చేయనున్న దరిమిలా, ముందు వచ్చినవారికే ముందు అవకాశం దక్కనుంది. అయితే, ఎక్స్పో ప్రాంతంలో జెయింట్ స్క్రీన్లపై వాటిని చూడవచ్చు.సాయంత్రం నాలుగు గంటలకు జెట్స్ ఆకాశంలో రంగులద్దనున్నాయి. రాత్రి 7 గంటలకు అల్ వాసల్ ప్లాజా వద్ద 400 మంది ప్రదర్శన ఇవ్వనున్నారు. 8 గంటలకు యోయో మా నిర్వహించబడుతుంది దుబాయ్ మిలినీయం యాంఫీ థియేటర్ వద్ద. 8.30 నిమిషాలకు జూబ్లీ స్టేస్ వద్ద నోరా జోన్స్ ప్రదర్శన.. ఇంకా మరిన్ని ప్రత్యేక ప్రదర్శనలు వుండనున్నాయి.
తాజా వార్తలు
- డాలర్తో రూపాయి చారిత్రక పతనం
- ఐపీఎల్ బెట్టింగ్ పై సీపీ సజ్జనార్ సీరియస్ వార్నింగ్
- IPL 2026 తొలి మ్యాచ్..ఎవరిది మొదటి గెలుపు?
- నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం మొదటి దశను ప్రారంభించిన ప్రధాని మోదీ
- టీవీ వీక్షకుల రేటింగ్స్ పై కేంద్రం సరికొత్త నిబంధనలు
- మేఘా పైపుల దహనం కేసులో వీడిన మిస్టరీ
- బిగ్ టికెట్లో బంగారు బార్స్ ను గెలుచుకున్న భారతీయులు..!!
- బిదియాలో ప్రమాదకరంగా వాగు దాటిన ఇద్దరు అరెస్టు..!!
- లెబనాన్ను వెంటనే విడిచి వెళ్లండి: సౌదీ అరేబియా
- కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన పీఎం..!!









