సైనా నెహ్వాల్ పరాజయo..
- April 03, 2016సిరి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో జరుగుతున్న ఇండియన్ ఓపెన్ బాడ్మింటన్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్లో భారత స్టార్ సైనా నెహ్వాల్ పరాజయాన్ని ఎదుర్కొని నిష్క్రమించింది. సెమీ ఫైనల్లో మూడో సీడ్ లీ జురుయ్తో తలపడిన రెండో ర్యాంక్ క్రీడాకారిణి సైనా 20-22, 21-17, 19-21 తేడాతో ఓటమిపాలైంది. ఇటీవల కొంతకాలంగా కాలి మడమ గాయంతో బాధపడుతున్న సైనా ఇంకా పూర్తిగా కోలుకోలేదని ఆమె ఆట స్పష్టం చేస్తున్నది. అయితే, ఆమె చివరి వరకూ పోరాటం సాగించి, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. కాగా, టైటిల్ కోసం రచానొక్ ఇంతానన్తో జురుయ్ తలపడుతుంది. మరో సెమీ ఫైనల్లో ఇంతానన్ 21-8, 21-11 ఆధిక్యంతో బయే ఇయాంగ్ జూపై గెలిచింది.పురుషుల సింగిల్స్లో విక్టర్ అక్సెల్సెన్, కెంటో మొమొతా ఫైనల్ చేరారు. అక్సెల్సెన్ 21-11, 21-11 స్కోరుతో సన్ వాన్ హూను ఓడించాడు. మరో సెమీ ఫైనల్లో మొమొతా మొదటి సెట్ను 17-21 తేడాతో చేజార్చుకున్నాడు. రెండో సెట్లో 3-6 తేడాతో వెనుకబడ్డాడు. అయితే, అ దేశలోనే ఫిట్నెస్ సమస్యతో పోటీ నుంచి వైదొలగడంతో మొమొతాకు ఫైనల్లో స్థానం దక్కింది. బాగానే ఆడాను! తాను బాగానే ఆడానని, అయతే, అంతకంటే మెరుగ్గా ఆడే అవకాశం తనకు ఉండిందని సైనా చెప్పింది. సెమీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆమె విలేఖరులతో మాట్లాడుతూ జురుయ్పై తీవ్రంగానే పోరాడినట్టు చెప్పింది. అయతే, ఒకటిరెండు చిన్నపొరపాట్ల కారణంగా ఓటమి తప్పలేదని వాపోయంది. ఇంతకంటే మెరుగ్గా ఆడే సత్తా తనకు ఉందని చెప్పింది.
తాజా వార్తలు
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్
- ఖలిస్థానీ ఉగ్రవాది హత్య కేసు.. ముగ్గురు భారతీయులు అరెస్టు
- బంగారం స్వచ్ఛతను తనిఖీ చేసే ఐదు సులభమైన మార్గాలు