టీసీఎస్ ఉద్యోగులు మోదీతో సెల్ఫీ..

- April 03, 2016 , by Maagulf
టీసీఎస్ ఉద్యోగులు  మోదీతో సెల్ఫీ..

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సౌదీ అరేబియాలోని రియాద్ లో టాటా కన్సల్టెన్సీ కార్యాలయాన్ని (టీసీఎస్) సందర్శించారు. మోదీకి టీసీఎస్ ప్రతినిధులు, మహిళా ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. మహిళలతో నడిచే టీసీఎస్ ఐటీ సెంటర్ ను సందర్శించిన మోదీ ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులతో ముచ్చటించారు. ఉద్యోగినులు మోదీతో కరచాలనం చేస్తూ సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.మోదీ మాట్లాడుతూ.. మహిళా సాధికారితకు ఐటీ నిపుణులు సలహాలు ఇవ్వాలని సూచించారు. అభివృద్ధిలో మహిళా శక్తి పాత్ర చాలా ముఖ్యమని అన్నారు. 'మీరందరూ తప్పకుండా భారత్ కు రావాలి. మీరు అద్భుతమైన ఆతిథ్యం స్వీకరిస్తారు' అని ఉద్యోగులను ఉద్దేశించి మోదీ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com