టీసీఎస్ ఉద్యోగులు మోదీతో సెల్ఫీ..
- April 03, 2016
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సౌదీ అరేబియాలోని రియాద్ లో టాటా కన్సల్టెన్సీ కార్యాలయాన్ని (టీసీఎస్) సందర్శించారు. మోదీకి టీసీఎస్ ప్రతినిధులు, మహిళా ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. మహిళలతో నడిచే టీసీఎస్ ఐటీ సెంటర్ ను సందర్శించిన మోదీ ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులతో ముచ్చటించారు. ఉద్యోగినులు మోదీతో కరచాలనం చేస్తూ సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.మోదీ మాట్లాడుతూ.. మహిళా సాధికారితకు ఐటీ నిపుణులు సలహాలు ఇవ్వాలని సూచించారు. అభివృద్ధిలో మహిళా శక్తి పాత్ర చాలా ముఖ్యమని అన్నారు. 'మీరందరూ తప్పకుండా భారత్ కు రావాలి. మీరు అద్భుతమైన ఆతిథ్యం స్వీకరిస్తారు' అని ఉద్యోగులను ఉద్దేశించి మోదీ అన్నారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







