టీసీఎస్ ఉద్యోగులు మోదీతో సెల్ఫీ..
- April 03, 2016భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సౌదీ అరేబియాలోని రియాద్ లో టాటా కన్సల్టెన్సీ కార్యాలయాన్ని (టీసీఎస్) సందర్శించారు. మోదీకి టీసీఎస్ ప్రతినిధులు, మహిళా ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. మహిళలతో నడిచే టీసీఎస్ ఐటీ సెంటర్ ను సందర్శించిన మోదీ ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులతో ముచ్చటించారు. ఉద్యోగినులు మోదీతో కరచాలనం చేస్తూ సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.మోదీ మాట్లాడుతూ.. మహిళా సాధికారితకు ఐటీ నిపుణులు సలహాలు ఇవ్వాలని సూచించారు. అభివృద్ధిలో మహిళా శక్తి పాత్ర చాలా ముఖ్యమని అన్నారు. 'మీరందరూ తప్పకుండా భారత్ కు రావాలి. మీరు అద్భుతమైన ఆతిథ్యం స్వీకరిస్తారు' అని ఉద్యోగులను ఉద్దేశించి మోదీ అన్నారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?