టీసీఎస్ ఉద్యోగులు మోదీతో సెల్ఫీ..
- April 03, 2016
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సౌదీ అరేబియాలోని రియాద్ లో టాటా కన్సల్టెన్సీ కార్యాలయాన్ని (టీసీఎస్) సందర్శించారు. మోదీకి టీసీఎస్ ప్రతినిధులు, మహిళా ఉద్యోగులు ఘన స్వాగతం పలికారు. మహిళలతో నడిచే టీసీఎస్ ఐటీ సెంటర్ ను సందర్శించిన మోదీ ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులతో ముచ్చటించారు. ఉద్యోగినులు మోదీతో కరచాలనం చేస్తూ సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.మోదీ మాట్లాడుతూ.. మహిళా సాధికారితకు ఐటీ నిపుణులు సలహాలు ఇవ్వాలని సూచించారు. అభివృద్ధిలో మహిళా శక్తి పాత్ర చాలా ముఖ్యమని అన్నారు. 'మీరందరూ తప్పకుండా భారత్ కు రావాలి. మీరు అద్భుతమైన ఆతిథ్యం స్వీకరిస్తారు' అని ఉద్యోగులను ఉద్దేశించి మోదీ అన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







