ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- April 01, 2022
అమరావతి: శుభకృత్ నామ సంవత్సరాది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి శుభాలను నాంది వాచకంగా నిలవాలని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ఆకాంక్షించారు.ఉగాది సందేశాన్ని అందించిన గవర్నర్, తెలుగు సంవత్సరానికి ఆదిగా భావించే సంతోషకరమైన, పవిత్రమైన “ఉగాది” సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు అందించారు. "ఉగాది" ఆనందం, ఆశల కలయికగా అందరికీ కొత్త ఉల్లాసాన్ని, ఉజ్వల భవిష్యత్తును అందించాలన్నారు. ‘శుభకృతు నామ ఉగాది’ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి, శ్రేయస్సు, సామరస్యం, సంతోషాన్ని కలిగించాలని గవర్నర్ పేర్కొన్నారు.ఉగాది పచ్చడి ఏడాది పొడవునా జీవితంలో అందించే అన్ని రకాల రుచులను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తుందని గవర్నర్ వివరించారు.నూతన సంవత్సరంలో సమృద్ధిగా వర్షాలు కురిసి వ్యవసాయ వృద్ది నమోదు చేయాలని, రైతులతో పాటు సకల వృత్తుల ప్రజలు ఆనందంగా ఉండాలని గవర్నర్ అన్నారు.ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని బహిరంగ ప్రదేశాల్లో ముసుగులు ధరించడం ద్వారా ప్రజలు తమను తాము రక్షించుకోవాలని,కరోనా ప్రవర్తన నియమావళి కట్టుబడి దాని వ్యాప్తిని నిరోధించాలని హరి చందన్ ప్రజలకు విజ్ఞప్తి చే
తాజా వార్తలు
- సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు ఎప్పుడొస్తాయి? పేరెంట్స్ లో ఆందోళనలు..!!
- బహ్రెయిన్ ప్రతినిధి బృందానికి కింగ్ హమద్ నేతృత్వం..!!
- 77 శాతానికి కార్మికులలో ప్రమాద అవగాహన..!!
- విమానయాన సంస్థల పై ప్రయాణికుల ఫిర్యాదుల పై విచారణ..!!
- IRGC కి సహకారం..ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష..!!
- 23 మంది అక్రమ చోరబాటుకు సహకారం..ఇద్దరి అరెస్టు..!!
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!









