ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఏపీ గవర్నర్
- April 01, 2022
అమరావతి: శుభకృత్ నామ సంవత్సరాది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి శుభాలను నాంది వాచకంగా నిలవాలని ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ ఆకాంక్షించారు.ఉగాది సందేశాన్ని అందించిన గవర్నర్, తెలుగు సంవత్సరానికి ఆదిగా భావించే సంతోషకరమైన, పవిత్రమైన “ఉగాది” సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు అందించారు. "ఉగాది" ఆనందం, ఆశల కలయికగా అందరికీ కొత్త ఉల్లాసాన్ని, ఉజ్వల భవిష్యత్తును అందించాలన్నారు. ‘శుభకృతు నామ ఉగాది’ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి, శ్రేయస్సు, సామరస్యం, సంతోషాన్ని కలిగించాలని గవర్నర్ పేర్కొన్నారు.ఉగాది పచ్చడి ఏడాది పొడవునా జీవితంలో అందించే అన్ని రకాల రుచులను అనుభవించడానికి సిద్ధంగా ఉండాలని సూచిస్తుందని గవర్నర్ వివరించారు.నూతన సంవత్సరంలో సమృద్ధిగా వర్షాలు కురిసి వ్యవసాయ వృద్ది నమోదు చేయాలని, రైతులతో పాటు సకల వృత్తుల ప్రజలు ఆనందంగా ఉండాలని గవర్నర్ అన్నారు.ప్రతి ఒక్కరూ ఉగాది పండుగను సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని బహిరంగ ప్రదేశాల్లో ముసుగులు ధరించడం ద్వారా ప్రజలు తమను తాము రక్షించుకోవాలని,కరోనా ప్రవర్తన నియమావళి కట్టుబడి దాని వ్యాప్తిని నిరోధించాలని హరి చందన్ ప్రజలకు విజ్ఞప్తి చే
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







